సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను కోసం మల్లెమాల వారు ఇంత పని చేశారా..?

ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో ఎంతటి ప్రేక్షకాదరణ పొందిందో అందరికీ తెలిసిన విషయమే. గత తొమ్మిది సంవత్సరాలుగా ప్రసారం అవుతున్న ఈ కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్లుగా బాగా పాపులర్ అయ్యారు. జబర్దస్త్ ద్వార పాపులర్ అయిన వారిలో హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను వంటి వారు ఉన్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం జబర్ధస్త్ షో పరిస్థితి చాలా దారుణంగా మారిపోయింది. జబర్దస్త్ లో ఉన్న స్టార్ కమెడియన్లు అందరు ప్రస్తుతం జబర్ధస్త్ నుండి బయటికి వచ్చారు.

మొదట గెటప్ శ్రీను సినిమా అవకాశాలు ఎక్కువ రావటంతో జబర్ధస్త్ నుండి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత హైపర్ ఆది కూడా జబర్ధస్త్ నుండి వెళ్ళిపోయాడు. ఆది జబర్ధస్త్ నుండి వెళ్ళిపోవటానికి కారణం ఇప్పటికి ఎవరికీ తెలియదు. వీరిద్దరు వెళ్లిపోయిన కూడా సుధీర్ ఒక్కడు జబర్దస్త్ ని ముందుకు నడిపేవాడు. కానీ ఇప్పుడు సుధీర్ కూడా జబర్ధస్త్ లో కనిపించటం లేదు. సుధీర్ కి కూడా సినిమా ఆఫర్లు ఎక్కువ రావటం వల్ల జబర్ధస్త్ షో మానేశాడు. అయితే సుధీర్ జబర్ధస్త్ మానేసి మరోక షోకి యాంకర్ గా వ్యవహరిస్తున్నాడు. అయితే సుధీర్ మాత్రం జబర్ధస్త్ షో కి దూరమయ్యాడు. ఇప్పుడు జబర్ధస్త్ షో లో ఆటో రాంప్రసాద్ మాత్రమే ఒంటరిగా పోరాడుతున్నాడు.

ఇద్దరు స్నేహితులు దూరం కావడంతో రాంప్రసాద్ ఒంటరివాడయ్యాడు. వారిద్దరూ లేనిలోటు బాగా కనిపిస్తోంది అంటూ జబర్ధస్త్ స్టేజి మీద కన్నీళ్ళు పెట్టుకున్నాడు. సుధీర్, శ్రీను, రాంప్రసాద్ స్నేహం గురించి రాకింగ్ రాకేష్ ఓ స్కిట్ రూపంలో బయట పెట్టేశాడు. ఈ స్కిట్ చూసి ఇంద్రజ అయితే ఎమోషనల్ అయ్యి మళ్లీ త్వరలోనే మీ ముగ్గురూ కలిసి ఇక్కడ స్కిట్ చేయాలి.. అది చూసేందుకు నేను ఇక్కడ ఉండాలి..అంటూ కన్నీళ్ళు పెట్టుకుంది. ఇలా సుధీర్, శ్రీనుని పరోక్షంగా జబర్దస్త్ కార్యక్రమంలోకి పిలవటానికి ఇలా రాంప్రసాద్ తో స్కిట్ చేయించారు. మొత్తానికి సుడిగాలి సుధీర్ గెటప్ శ్రీను లేని లోటు జబర్దస్త్ లో బాగా కనిపిస్తోంది.