శ్రీకాకుళం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం.. ఆరుగురు మృతి!

శ్రీకాకుళం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది.  జిల్లాలలో జి.సిగడాం మండలం బాతువా సమీపంలో సాంకేతిక కారణాల వల్ల  గౌహతి ఎక్స్‌ప్రెస్‌ నిలిచిపోవడంతో అందులో నుండి ప్రయాణికులు కిందకు దిగారు. ఇంతలోనే అనుకోకుండా మరో ట్రాక్‌లో  కోణార్క్‌ రైలు వేగంగా దూసుక వచ్చి  ప్రయాణికులను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.