వాళ్ళకి క్లారిటీ..మహేష్ ది భయం కాదు..గౌరవం.!

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా “సర్కారు వారి పాట”. దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తున్న భారీ సినిమా ఇది. మహేష్ కెరీర్ లో మోస్ట్ అవైటెడ్ సినిమాగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఆల్రెడీ సంక్రాంతి రేస్ నుంచి తన పోటీని విరమించుకున్న సంగతి తెలిసిందే.

రాజమౌళి భారీ సినిమా కూడా రేస్ లోకి రావడంతో మహేష్ సినిమా రేస్ నుంచి తప్పుకుంది. కానీ నిన్న పవన్ నటిస్తున్న భీమ్లా నాయక్ రేస్ లో కన్ఫర్మ్ కావడంతో ఓ టాక్ వైరల్ అవుతుంది. మహేష్ ఈ పోటీలో భయంతోనే తప్పుకున్నాడని అర్ధం అవుతుంది అని ఓ హాట్ టాపిక్ ఇప్పుడు నడుస్తుంది.

కానీ ఇందులో అసలు ఎలాంటి నిజం లేదని చెప్పాలి. మహేష్ కేవలం రాజమౌళి పై గౌరవంతోనే పోటీ నుంచి విరమించుకున్నాడు తప్ప పోటీ అనో లేక సినిమాలకు నష్టం వస్తుందనే కాదు. దీనితో ఆ కొంతమందికి మహేష్ విషయంలో కాస్త క్లారిటీ వచ్చినట్టేగా..