ఆదిపురుష్’.. సీతగా మహేష్ హీరోయిన్

Mahesh heroine as Seetha in Adipurush

Mahesh heroine as Seetha in Adipurush

ప్రభాస్ చేస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా ‘ఆదిపురుష్’. ఇండియాలో తెరకెక్కుతున్న అత్యంత ఖరీదైన చిత్రాల్లో ఇదే అగ్ర స్థానంలో ఉంది. ఈ సినిమాను నిర్మిస్తున్నది బాలీవుడ్ నిర్మాతలు. అందుకే ఖర్చుకు వెనుకాడటంలేదు. అగ్ర నటీనటులను సినిమాలోకి తీసుకుంటున్నారు. రావణుడి పాత్రలో సైఫ్ అలీఖాన్ నటిస్తుండగా ముఖ్యమైన సీత పాత్రలో ప్రభాస్ సరసన నటించబోయేది ఎవరనేది సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇన్నాళ్లు విషయాన్ని దాచిపెట్టిన దర్శక నిర్మాతలు ఇప్పుడు రివీల్ చేశారు. సీత పాత్రలో కృతిసనన్ నటించనున్నట్లు హింట్ ఇచ్చేశారు.

కృతిసనన్ కెరీర్ ఆరంభమైంది తెలుగులోనే. మహేష్ బాబు చేసిన ‘వన్ నేనొక్కడినే’ చిత్రంతో వెండితెరకు పరిచయమైంది ఆమె. ఆ తరవాత తెలుగుకు గుడ్ బై చెప్పేసి బాలీవుడ్ వైపు వెళ్ళిపోయింది. అక్కడ మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఆమెనే ‘ఆదిపురుష్’ ఆఫర్ వరించింది. మధ్యలో కీర్తి సురేష్, అనుష్కల పేర్లు వినబడినా చివరకు ఉత్కంఠ వీడి కృతి సనన్ తెరపైకి వచ్చింది. ఈ చిత్రం ఆమెకు లైఫ్ టైమ్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అనొచ్చు. ఆమె షూటింగ్లో కూడ పాల్గొంటోంది. ఇది గనుక హిట్ అయితే ఆమెకు స్టార్ హీరోల సినిమా ఆఫర్లు వెల్లువెత్తే అవకాశం ఉంది. టీసిరీస్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రాన్ని వచ్చే ఏడాది ఆగష్టు 11న రిలీజ్ చేయనున్నారు. పలు భారతీయ భాషల్లో ఈ చిత్రం విడుదలకానుంది.