Mahesh Babu: సర్కారీ వారి పాట విడుదలపై ఆందోళనలో మహేష్ ఫాన్స్… బ్యాడ్ సెంటిమెంట్ అంటూ!

Mahesh Babu: సినిమా ఇండస్ట్రీలో వారికి ఎన్నో రకాల సెంటిమెంట్లు ఉంటాయి. అందుకే వీరు వీరి సినిమాల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు.సినిమా విడుదల విషయంలో కానీ లేదంటే దర్శక నిర్మాతలు ఇతర సెలబ్రిటీల విషయంలో ఈ విధమైనటువంటి సెంటిమెంట్లను పాటిస్తారు. అయితే తాజాగా మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో సర్కారీ వారి పాట చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.అయితే ముందుగా అనుకున్న ప్రకారం ఈ సినిమాని సంక్రాంతి కానుకగా విడుదల చేయాల్సి ఉంది.కొన్ని కారణాల వల్ల ఈ సినిమా సంక్రాంతి బరి నుంచి తప్పుకుంది.

ఈ క్రమంలోనే ఈ సినిమాని ఏప్రిల్ కి వాయిదా వేయగా తిరిగి ఈ సమయంలో రాజమౌళి త్రిబుల్ ఆర్ రావడంతో మరోసారి ఈ సినిమాను వాయిదా వేస్తూ మే నెలలో విడుదలకు సిద్ధం చేశారు. ఇలా మే 12వ తేదీ ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ విడుదల తేదీపై మహేష్ బాబు అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటివరకు మహేష్ బాబు నటించిన కొన్ని చిత్రాలు మే నెలలో విడుదల అయి బాక్సాఫీసు వద్ద డిజాస్టర్ ఎదుర్కొన్నాయి. ఇలాంటి సమయంలో ఈ చిత్రాన్ని కూడా మే నెలలో విడుదల చేయనున్నట్లు ప్రకటించడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మహేష్ బాబు తన కెరియర్ లో నటించిన నిజం, నాని, బ్రహ్మోత్సవం వంటి సినిమాలు మే నెలలో విడుదల అయి బాక్సాఫీసు వద్ద ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నాయి. కానీ పూజా హెగ్డే మహేష్ బాబు జంటగా నటించిన మహర్షి సినిమా కూడా మే నెలలో విడుదల అయ్యి 100 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. ఇలా మహర్షి ఇచ్చిన నమ్మకంతోనే నిర్మాతలు ఈ సినిమాని కూడా మే నెలలో విడుదల చేయాలని భావించినట్లు తెలుస్తోంది. అయితే సర్కారీ వారి పాట విషయంలో మహేష్ బాబు సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో వేచి చూడాలి.