Mahesh Babu: అన్నయ్య మృతిచెందడంతో.. ఎమోషనల్ పోస్ట్ చేసిన మహేష్ బాబు.. పోస్ట్ వైరల్!

Mahesh Babu: కృష్ణ వారసుడిగా రమేష్ బాబు పలు చిత్రాలలో హీరోగా నటించి అనంతరం నిర్మాతగా బాధ్యతలను చేపట్టి నిన్న సాయంత్రం కాలేయ వ్యాధితో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇతను మరణవార్తను ఘట్టమనేని కుటుంబం సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. రమేష్ బాబు మరణ వార్త విన్న వెంటనే ఎంతోమంది ఈయన మృతి పట్ల సంతాపం ప్రకటించారు.

ఇకపోతే మహేష్ బాబు నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా దుబాయ్ వెళ్లిన సంగతి మనకు తెలిసిందే.దుబాయ్ వెళ్లి వచ్చిన తర్వాత స్వల్ప లక్షణాలు ఉండడంతో మహేష్ బాబు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా ఆయనకు పాజిటివ్ అని నిర్ధారణ జరిగింది. ఈ క్రమంలోనే మహేష్ బాబు తన కుటుంబ సభ్యులు హోమ్ క్వారంటైన్ లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు.

ఇలా మహేష్ బాబు కరోనా బారిన పడటంతో చివరిసారిగా అతని అన్నయ్యను చూసుకోలేని పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే రమేష్ బాబు అంత్యక్రియలకు మహేష్ బాబు దూరంగా ఉన్నారు.ఈ క్రమంలోనే మహేష్ బాబు మొట్టమొదటిసారిగా తన అన్నయ్య గురించి ఎమోషనల్ పోస్ట్ చేశారు. అన్నయ్య నువ్వే నా బలం.. నా ధైర్యం.. నువ్వే నా సర్వస్వం.. నువ్వే లేకపోతే ఈరోజు నాలో సగం జీవితం ఉండేది కాదు. నా కోసం ఎంతో శ్రమించారు ఇకపై విశ్రాంతి తీసుకో..మళ్లీ వచ్చే జన్మంటూ ఉంటే తప్పకుండా నువ్వు నా అన్నయ్యగా పుట్టాలి. లవ్ యు అన్నయ్య అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.