Crime: ప్రేమికుల మధ్య చిచ్చు పెట్టిన ఫోన్ కాల్.. చివరికి ఏం జరిగిందంటే..?

Crime: యూపీలోని ఘజియాబాద్ కు చెందిన శివమ్ చౌహన్ అనే వ్యక్తి, ఢిల్లీలోని కిషన్ గడ్ కు చెందిన ఒక యువతి గత నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలోనే వారిద్దరూ ఏకాంతంగా కలుసుకోవడానికి ఢిల్లీలోని వసంత్ కుంజ్ ప్రాంతంలో ఒక హోటల్ కు వచ్చారు. ఈ క్రమంలోనే వారు హోటల్ రూమ్ లో ఉండగా, సదరు యువతికి ఒక వ్యక్తి వరుసగా ఫోన్ కాల్ చేశాడు. అప్పుడు శివమ్ తన ప్రియురాలిని ఎవరు ఫోన్ చేస్తున్నారు అని ప్రశ్నించగా సోదరి ప్రియుడు అని బుకాయించింది. అయితే ఆమె మాటలు శివమ్ మళ్లీ ప్రశ్నించడంతో వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

ఈ క్రమంలోనే ఆవేశంతో అతను తన ప్రియురాలి తలను నేలకేసి కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఇక మరుసటి రోజు ఉదయం అతనొక్కడే బయటికి వెళ్లడం గమనించిన హోటల్ సిబ్బంది రూమ్ కి వెళ్లి చూడగా అక్కడ ఆమె డెడ్ బాడీ కనిపించింది. వెంటనే హోటల్ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇవ్వగా సీసీటీవీ కెమెరాల ఆధారంగా శివమ్ ను పోలీసులు పట్టుకున్నారు. ఒక పోలీసుల విచారణలో తనను ప్రియురాలు మోసం చేసి ఉత్కర్ అనే మరో యువకుడితో సంబంధం పెట్టుకున్నట్లు తెలిపాడు. అందుకే తాను చంపేసినట్లు శివమ్ ఒప్పుకున్నాడు.