KTR: టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలకు ఆహ్వానం ఉంటేనే రండి అంటున్న కేటీఆర్..

KTR: ఈనెల 27న హైదరాబాదులో హెచ్ఐసీసీలో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరగనున్న సంగతి తెలిసిందే. ఇక ఈ వేడుక గురించి సీఎం కేసీఆర్ కూడా కొన్ని విషయాలు పంచుకున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తమ పార్టీ శ్రేణులకు కీలక సూచనలు అందజేశాడు.

దయచేసి కేవలం ఆహ్వానాలు ఉన్నవారు మాత్రమే రావాలని.. వారికి పాసులు అందజేస్తాం అని అన్నాడు. ఇక ఈ వేడుకకు దాదాపు 3 వేల మంది ప్రతినిధులు హాజరవుతారని అందులో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్ లు వస్తారని తెలిపాడు. అంతేకాకుండా సభలో పార్టీ, రాజకీయ తీర్మానాలు ఉంటాయని అన్నాడు.