త్వరలో అల్లూరి భవనం నిర్మాణం చేస్తానంటున్న కేటీఆర్..

ఈరోజు మన్యం వీరుడి అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై వేడుకలు నిర్వహించారు. ఇక ఆ వేడుకలకు మంత్రి కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు పాల్గొన్నారు. అక్కడి సీతారామరాజు విగ్రహానికి పూలమాలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా అక్కడ కేటీఆర్ కొన్ని విషయాలు పంచుకున్నారు.

త్వరలోనే హైదరాబాదులో ఖానామెట్ లో అల్లూరి భవన నిర్మాణ కోసం కేసీఆర్ మూడెకరాల భూమిని కేటాయించారని తెలిపారు. ఇక వీరుడు దేశంలో ఎక్కడ పుట్టిన కూడా వీరుడే అని.. మన్యం వీరుడుని గుర్తు చేసుకోవడం భారత పౌరుడి విధి అని అన్నారు.