ఆ హీరోయిన్‌కు క‌రోనా నెగెటివ్‌.. సంతోషంగా ప్ర‌క‌టించుకున్న మ‌హేష్ బ్యూటీ

క‌రోనా మ‌హ‌మ్మారి సెల‌బ్రిటీల‌ని సైతం వ‌ణికిస్తున్న సంగ‌తి తెలిసిందే.చిన్న, పెద్ద‌, ధ‌నిక‌, పేద అనే తేడా లేకుండా అంద‌రిని భ‌య‌బ్రాంతుల‌కి గురి చేస్తుంది. క‌రోనాకి భ‌య‌ప‌డి అడుగు తీసి అడుగు బ‌య‌ట‌పెట్టాలంటే భ‌య‌ప‌డాల్సి వ‌స్తుంది. ఎనిమిది నెల‌ల పాటు క‌రోనా వ‌ల‌న ఆగిన షూటింగ్స్ ఇప్పుడు శ‌రవేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్నాయి. క‌రోనా నిబంధ‌న‌లు పాటిస్తూ వీలైనంత త్వ‌ర‌గా షూటింగ్ ముగించే ప్లాన్ లు వేస్తున్నారు. రీసెంట్‌గా కృతి స‌న‌న్‌.. రాజ్‌కుమార్ రావు సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని చంఢీఘ‌ర్ నుండి ముంబై వ‌చ్చింది. అందుకు సంబంధించిన పోస్ట్‌ని సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది.

కొద్ది రోజుల త‌ర్వాత త‌న‌కు క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డంతో ప‌రీక్ష‌లు చేయించుకోగా, అందులో పాజిటివ్ అని తేలింది. దీంతో కొద్ది రోజులుగా స్వీయ నిర్భందంలో ఉన్న కృతి స‌న‌న్ త‌న‌కు తాజాగా నెగెటివ్ వ‌చ్చింద‌ని సోష‌ల్ మీడియాలో చెప్పుకుంది . ‘‘కోవిడ్‌ నెగటివ్‌ వచ్చిందనే వార్త షేర్‌ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. నాకు సహాయపడ్డ వైద్యులకు ధన్యవాదాలు. నేను త్వరగా కోలుకోవాలని కోరుకున్న అందరికీ కృతజ్ఞతలు’’ అని ట్వీట్‌ చేశారు కృతీ సనన్‌. వ‌చ్చే ఏడాది ప్రారంభంలో కృతి స‌న‌న్.. అక్ష‌య్ కుమార్ బ‌చ్చ‌న్ పాండే చిత్ర షూటింగ్‌లో పాల్గొన‌నుంది

మహేష్ బాబు వ‌న్..నేనొక్క‌డినే చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది ఢిల్లీ భామ కృతిస‌న‌న్. ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఘోరంగా ఫ్లాన్ కావ‌డంతో కృతికి పెద్ద‌గా పేరు రాలేదు. ఆ త‌ర్వాత నాగ‌చైత‌న్య‌తో క‌లిసి దోచెయ్ సినిమాలో న‌టించింది. ఈ సినిమా కూడా ఫ్లాప్ అయింది. దీంతో ఈ భామ‌కి తెలుగులో ఆఫ‌ర్స్ క‌రువ‌య్యాయి. వెంట‌నే బాలీవుడ్ ఫ్లైటెక్కిన కృతి .. అక్ష‌య్ కుమార్‌, షారుక్ ఖాన్ వంటి స్టార్ హీరోల చిత్రాల‌తోపాటు ప‌లు సినిమాల్లో న‌టిస్తూ బిజీ అయిపోయింది. తాజాగా ఈమె ప్రభాస్ హీరోగా నటిస్తోన్న‘ఆదిపురుష్’లో సీత పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. అతి త్వ‌ర‌లోనే దీనిపై పూర్తి క్లారిటీ రానుంది.