ఆ విషయంలో రామ్ కి నేను మ్యాచ్ అవలేనని భయపడిన కృతి శెట్టి…?

అందాల నటి కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఉప్పెన సినిమా ద్వారా హీరోయిన్ గా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ అమ్మడు మొదటి సినిమాతోనే తన అందం, అభయంతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇలా ఉప్పెన సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వటంతో టాలీవుడ్ దర్శకులను తన వైపు తిప్పుకున్న కృతి శెట్టి ప్రస్తుతం వరుస ఆఫర్లతో బిజీగా ఉంది. ఇటీవల ఈ అమ్మడు నటించిన బంగార్రాజు సినిమా కూడా మంచి హిట్ అయింది. ప్రస్తుతం లింగు స్వామి దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా నటించిన ‘ది వారియర్’ సినిమాలో కృతి శెట్టి కథానాయక పాత్రలో నటించింది.

రామ్, కృతి శెట్టి జంటగా నటించిన ” ది వారియర్ ” సినిమా జులై 14 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో రామ్ మొట్టమొదటిసారిగా పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. ఇక ఈ సినిమాలో విలన్ పాత్రలో ఆది పినిశెట్టి నటించాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అయితే సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో సినిమా ప్రమోషన్ పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో కృతిశెట్టి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొనింది. ఈ ఇంటర్వ్యూలో కృతి శెట్టి ఈ సినిమాకు సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకుంది.

ఈ ఇంటర్వ్యూలో కృతి శెట్టి మాట్లాడుతూ ..వారియర్‌ సినిమాకు ఓకే చెప్పిన తర్వాత రామ్‌ సినిమాలన్నీ చూశారట. ఆ సినిమాలలో రామ్ ఎనర్జీ చూసి అతని ఎనర్జీ కి నేను మ్యాచ్‌ అవుతానే కాదోనని చాలా భయపడ్డాను అంటూ కృతి చెప్పుకొచ్చింది. ముఖ్యంగా ఈ సినిమాలో బుల్లెంట్‌ సాంగ్‌కు రామ్ తో డ్యాన్స్‌ చేయటానికి చాలా నెర్వస్‌గా ఫీలయ్యాను. కానీ రామ్ డ్యాన్స్‌ చేసేటప్పుడు చాలా ఎంజాయ్‌ చేశాను’ అని కృతి చెప్పుకొచ్చింది. అంతే కాకుండా తనకి యాక్షన్ పాత్రలలో నటించాలి కోరిక అంటూ తన డ్రీమ్ గురించి బయటపెట్టింది.