Krithi Shetty: యాంకర్లు చేసిన పనికి కెమెరా ముందే కన్నీళ్ళు పెట్టుకున్న కృతి శెట్టి…!

Krithi Shetty: వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఉప్పెన సినిమా ద్వారా కృతి శెట్టి తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఈ సినిమా సూపర్ హిట్ అవటంతో ఈమెకు తెలుగులో వరుసగా ఆఫర్లు వచ్చి పడ్డాయి. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోల సరసన నటించే అవకాశం కూడా దక్కింది. ఇటీవల ఈమె నాగ చైతన్య సరసన నటించిన బంగార్రాజు సినిమా కూడా మంచి విజయం అందుకుంది. ఇక నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన శ్యామ్ సింగ రాయ్ సినిమాలో కూడా నటించింది. ఇలా తెలుగులో వరుస హిట్లు అందుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం రామ్ పోతినేని హీరోగా నటించిన ది వారియర్ సినిమా లో రామ్ కి జోడీగా నటించింది. ఈ సినిమాకు ప్రముఖ తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వం వహించారు.

ఈ సినిమ తెలుగు, తమిళ భాషలలో చిత్రీకరించారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా సినిమా ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ చూసిన అభిమానులు సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా జులై 14 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అందువల్ల ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా కృతి శెట్టి తమిళనాట సందడి చేస్తోంది. ఈ క్రమంలో ఇటీవల బిహైండ్‌వుడ్స్‌ యూట్యూబ్‌ ఛానల్‌ నిర్వహించిన అవార్డు ఫంక్షన్ లో పాల్గొనింది.

ఈ ఫంక్షన్ కి హాజరు అవ్వటానికి ముందు కృతి శెట్టి ఒక ఇంటర్వ్యూ లో పాల్గొంది. ఈ ఇంటర్వ్యూలో ఆషిక్‌, సారథిరన్‌ ఆమెను పలు ప్రశ్నలు వేశారు. ఇంటర్వ్యూ మధ్యలో ఇద్దరు గొడవ పడుతూ .. సారథిరన్‌, ఆషిక్‌పై చెయ్యి చేసుకున్నాడు. దీంతో అక్కడ ఏం జరుగుతుందో తెలియక కృతి శెట్టి కంగారు పడింది. ఆమె కంగారు పడటం గమనించిన వారు ఇదంతా ప్రాంక్ అని చెప్పారు. దాంతో ఊపిరి పీల్చుకున్న ఆమె కన్నీరు పెట్టుకున్నారు. ఎందుకు కన్నీళ్ళు పెట్టుకున్నావు అని అడగగా..” ఎవరైనా కఠినంగా మాట్లాడితే నాకు నచ్చదు . అందుకే ఇలా ఏడుపొచ్చింది” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.