Nagarjuna: కరోనాతో గోవాకు చెక్కేసిన కింగ్ నాగార్జున…. గోవాలో హోమ్ ఐసోలేషన్!

Nagarjuna: ఇటీవలే సర్కారువారి పాట టీ కి కరోనా రావడం అందరు ఐసొలేషన్ లో ఉండటం తెలిసిందే. కాగా ఇపుడు బంగార్రాజు టీం కూడా కరోనా బారినపడ్డారు. ఇటీవల కృతి శెట్టికి కరోనా పాజిటివ్ అని వార్తలు వినిపించాయి. ఇపుడు బంగార్రాజు చిత్ర యూనిట్ లో చాలా మంది సభ్యులకు కరోనా సోకిందని తెలుస్తోంది. ఈ కారణంగా కింగ్ నాగార్జున తన కుటుంబ సభ్యులతో పాటు గోవా వెళ్ళడానికి అన్నీ ఏర్పాట్లు చేసుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి దర్శనం తర్వాత అక్కడి నుండి నేరుగా నాగార్జున ఫ్యామిలీ గోవాకి వెళ్లారు.

అక్కడే సెల్ఫ్ ఐసొలేషన్ ఉండేలా ఏర్పాట్లు చేసుకున్నారు. దీంతో స్పెషల్ ఫ్లైట్ లో గోవాకు చెక్కేసారు. ఇటీవలే అక్కినేని నాగార్జున, తన కొడుకు నాగచైతన్యతో కలిసి నటించిన బంగార్రాజు సినిమా సంక్రాంతి కనుక గా జనవరి 14 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హిట్ టాక్ రావడంతో పాటు కలెక్షన్స్ పరంగా మంచి జోరు ప్రదర్శిస్తోంది.ఇప్పటికే 100కోట్ల క్లబ్ లో చేరిందనే టాక్ వినిపిస్తోంది. బంగార్రాజు సినిమాను OTT ఫ్లాట్ ఫామ్ లో చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఇందులో నాగార్జునకు జోడిగా రమ్యకృష్ణ, నాగచైతన్య సరసన ఉప్పెన సినిమాతో కుర్రకారు మనసు దోచుకున్న కృతి శెట్టి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. వీళ్ల మధ్య కెమిస్ట్రీ కూడా బాగానే వర్కౌట్ అయింది. నాగచైతన్య, సమంత విడాకుల తర్వాత తీసిన సినిమా అయినా ఆ ప్రభావం సినిమా మీద పడలేదని చెప్పవచ్చు. మొత్తానికిఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో నాగార్జున నాగచైతన్య తన తదుపరి చిత్రాల పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.