ప్రేమ పెళ్లి గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన కియారా.. అంత తీరిక లేదంటూ కామెంట్స్!

భరత్ అనే నేను సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి కియారా మొదటి సినిమాతోనే విపరీతంగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుని పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేశారు. ఈ సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన వినయ విధేయ రామ సినిమాలో నటించారు. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను సందడి చేయలేకపోయింది. ఈ సినిమా అనంతరం తెలుగు తెరకు దూరమైన ఈమె బాలీవుడ్ సినిమాలతో బిజీ అయ్యారు.

ఈ విధంగా ఎన్నో బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రాలలో నటిస్తున్న కియారా బాలీవుడ్ నటుడు సిద్ధార్థ మల్హోత్రాతో ప్రేమలో ఉన్నట్లు పెద్దఎత్తున ప్రేమ గురించి వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే ప్రేమలో ఉన్న ఈ జంట మనస్పర్థల కారణంగా వీరి ప్రేమకు బ్రేకప్ చెప్పుకున్నారని వార్తలు వచ్చాయి. అయితే వీరి గురించి ఇలాంటి వార్తలు వచ్చినప్పటికీ ఈ వార్తలపై ఈ జంట ఏ విధంగానూ స్పందించలేదు.తాజాగా తన గురించి వస్తున్న ఇలాంటి వార్తలపై స్పందించిన ఈమె ప్రేమ గురించి క్లారిటీ ఇచ్చారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన ప్రేమ పెళ్లి గురించి వస్తున్న వార్తలను పట్టించుకునే అంత తీరిక తనకు లేదని తెలిపారు.తాను ఇండస్ట్రీలోకి నటిగా నిరూపించుకోవడం కోసం వచ్చానని ప్రస్తుతం అదే ప్రయత్నంలో ఉన్నానని తెలిపారు. ప్రస్తుతం తన దృష్టి మొత్తం సినిమాలపైనే ఉందని ఈమె వెల్లడించారు. ఇకపోతే తన వ్యక్తిగత విషయాలను కేవలం తన కుటుంబ సభ్యులతో మాత్రమే చర్చించుకోవడానికి తాను ఇష్టపడతానని ఈ సందర్భంగా కియారా తనపై వస్తున్న వార్తలపై స్పందించారు.ఇకపోతే ఈమె ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నారు.