రాజమౌళి దర్శకత్వం వహించిన త్రిబుల్ ఆర్ సినిమా ద్వారా పాన్ ఇండియా హీరోగా జూనియర్ ఎన్టీఆర్ స్థాయి మరింత పెరిగింది. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఇటీవల ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రశాంత్ నీల్ 20 సంవత్సరాలుగా ఎన్టీఆర్ తో సినిమా చేయాలని ఎదురుచూస్తున్నారు. అందరి డైరెక్టర్లులాగే ప్రశాంత్ నీల్ కూడా ఎన్టీఆర్ ని డైరెక్ట్ చేయడానికి గత కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాడు. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు ప్రశాంత్ నీల్ అదిరిపోయే వార్తని చెప్పాడు.
తాజాగా ఎన్టీఆర్31′(#NTR31) ప్రాజెక్ట్ తో తన కల నెరవేరబోతోందని ప్రశాంత్ నీల్ చెప్పుకొచ్చాడు. తన ఫేవరెట్ హీరోతో ఇలా తన డ్రీమ్ ప్రాజెక్ట్ చేయిస్తుండడం వల్ల ప్రశాంత్ నీల్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్31′ ( #NTR31) ఫస్ట్ లుక్ రిలీజ్ చేశాడు. ఈ సినిమాకి సంబంధిన స్టోరీ మెయిన్ లైన్ కూడ ట్విట్టర్ ద్వారా షేర్ చేశాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రని వివరించే ప్రయత్నం చేస్తూ..రక్తంలో తడిసిన మట్టి మాత్రమే గుర్తుంచుకోవాలి. ఆయన నేల.. ఆయన ప్రస్థానం.. కానీ ఖచ్చితంగా అతని రక్తం కాదు’ అంటూ పవర్ ఫుల్ డైలాగ్ ని రిలీజ్ చేశాడు.
ఈ ఫస్ట్ లుక్ చూసిన NTR అభిమానులు తెగ ఆనంద పడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. కే జి ఎఫ్ టు ద్వారా టాప్ డైరెక్టర్ల లిస్టులో చేరిపోయిన ప్రశాంత్ నీల్ ఈ సినిమాని ప్రేక్షకుల ఎక్స్పెక్టేషన్స్ కు మించి తెరకెక్కించనున్నట్టు సమాచారం. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సలార్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు.
