Keerthy Suresh: టాలీవుడ్ హీరోయిన్ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీ గ గడుపుతోంది కీర్తి సురేష్. ఒక వైపు హీరోయిన్ గా కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో మెప్పిస్తోంది ఈ స్టార్ బ్యూటీ కీర్తి సురేష్. పెళ్లి తరువాత కూడా వరుసగా సినిమాలు చేస్తూ వస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈమ ఆమె ప్రముఖ మ్యాగజైన్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఆమె మాట్లాడుతూ.. తన సినిమాల గురించి తదుపరి చేయబోతున్న సినిమాల గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.
ఈ సందర్బంగా కీర్తి సురేష్ మాట్లాడుతూ.. సినీ ఇండస్ట్రీలో నేను చేయాల్సిన ప్రయాణం ఇంకా చాలా ఉంది. అందుకే వరుసగా సినిమాలను ఒకే చేయడం లేదు. ఒక పక్క గ్లామరస్ రోల్స్ చేస్తూనే మరోపక్క పాత్ర ప్రధానమైన సినిమాలు చేసేలా ప్లాన్ చేసుకుంటున్నాను. ఈ మధ్య కాలంలో చాలా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేశారు. ఆడియన్స్ నుంచి కూడా మంచి స్పందన వచ్చింది. ఇక బాలీవుడ్ ఎంట్రీ గురించి మాట్లాడుతూ.. బాలీవుడ్ లో వరుణ్ ధావన్ తో బేబీ జాన్ సినిమా చేశాను. ఇది తమిళ తెరీ సినిమాకు రీమేక్.
అది నా కెరీర్ లో మరో ఉత్తేజకరమైన అధ్యాయం అని చెప్పాలి. కేవలం నన్ను సవాలు చేసే పాత్రల కోసం, కొత్త కొత్త కథల కోసం మాత్రమే బాలీవుడ్ లో అడుగు పెట్టాను. అక్కడ పనిచేసే విధానం, వారి సంస్కృతి కొత్తగా ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుంటూ, కొత్త విషయాలను నేర్చుకుంటున్నాను. మొత్తంగా ఆ ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్నాను. సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ అవ్వాలంటే ముందు గ్రాడ్యుయేషన్ పూర్తి చేయాలని మా నాన్న కండీషన్ పెట్టారు. ఆ మక్కువతోనే చదువులో కూడా ఫ్యాషన్ డిజైనింగ్ ఆప్టిన్ తీసుకున్నాను అని చెప్పుకొచ్చింది హీరోయిన్ కీర్తి సురేష్. ఈ సందర్భంగా ఆమె చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాలి. ఇకపోతే కీర్తి సురేష్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె రివాల్వర్ రీటా, కన్నెవెడి వంటి సినిమాలు చేస్తోంది. ఈ రెండు ప్రస్తతం షూటింగ్ దశలో ఉన్నాయి. తత్వరలోనే ఈ రెండు సినిమాల విడుదల తేదీలు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
Keerthy Suresh: అందుకే నేను వరుసగా సినిమాలు చేయడం లేదు.. కీర్తి సురేష్ కామెంట్స్ వైరల్!
