Keerthi Suresh: ఐరన్ లెగ్ అన్నారంటూ ఆవేదన వ్యక్తం చేసిన కీర్తి సురేష్!

Keerthi Suresh: టాలీవుడ్ మహానటి కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. నేను శైలజ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యింది. మొదటి సినిమాతోనే తన అందం అభినయంతో కుర్రకారుని కట్టిపడేసిన ఈ ముద్దుగుమ్మ ఆ తరువాత మహానటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా రాణిస్తోంది. ఇకపోతే సినీ ఇండస్ట్రీలో విమర్శలు అన్నవి సహజంగా వినిపిస్తూనే ఉంటాయి. కొన్ని కొన్ని సందర్భాలలో కొందరు ఐరన్ లెగ్ అనే పేర్లతో కూడా పిలవబడుతూ ఉంటారు.

అలాంటి వారిలో కీర్తిసురేష్ కూడా ఒకరు. కెరీర్ ఆరంభంలో తాను కూడా ఐరన్ లెగ్ అన్న విమర్శలను ఎదుర్కొన్నారు అని కీర్తిసురేష్ తెలిపింది. మొదట మలయాళ ఇండస్ట్రీలో హీరోయిన్ గా నా కెరీర్ మొదలై.. ఆ తరువాత నా మొదటి సినిమా కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది అని తెలిపింది. ఆ తర్వాత వచ్చిన రెండు సినిమాలు కూడా మధ్యలోనే ఆగిపోయాయి.. దానితో కొంత మంది నాపై ఐరన్ లెగ్ అన్న ముద్ర ను కూడా వేశాడు. నన్ను పెట్టుకుంటే ఆ సినిమా ఆగిపోతుంది అన్న ప్రచారం కూడా చేశారు.

ఆ ప్రచారాల కారణంగా నాకు కొన్ని సినిమా అవకాశాలు కూడా పోయాయి.. ఐరన్ లెగ్ అన్న విమర్శలు వచ్చినప్పుడు నాకు చాలా బాధ కలిగేది.. అయినప్పటికీ వాటిని పెద్దగా పట్టించుకోకుండా పనిచేస్తూ వెళ్లాను.. అలా ఆ ఐరన్ లెగ్ అన్న విమర్శల నుంచి బయట పడటానికి దాదాపుగా మూడేళ్ల సమయం పట్టింది.. కేవలం నాకు మాత్రమే కాదు.. కెరీర్ మొదలుపెట్టిన చాలామంది హీరోయిన్స్ ఇలాంటి విమర్శలు ఎదుర్కొన్న వారే అని చెప్పుకొచ్చింది కీర్తి సురేష్. అలా ఎవరు ఎన్ని ఏమన్నా పట్టించుకోకుండా ముందుకు సాగాను కాబట్టి ఈ రోజు మీ ముందు ఇలా నిలబడి మాట్లాడగలుగుతున్నాను అని చెప్పుకొచ్చింది. శుభోదయం ప్రస్తుతం కీర్తి సురేష్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాలో నటిస్తోంది. అదే విధంగా చిరంజీవి నటిస్తున్న బోళా శంకర్ సినిమాలో చిరంజీవి చెల్లెలి పాత్రలో నటిస్తోంది.వీటితోపాటు పలు అవకాశాలతో దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ.