పెళ్లికి ముందే విక్కీ,కత్రినాలపై పోలీసు కేసు?

ప్రస్తుతం సోషల్ మీడియాలో బాలీవుడ్ లవ్ బర్డ్స్ అయిన కత్రినాకైఫ్,విక్కీ కౌశల్ ల జంట త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. గతకొద్ది కాలంగా ప్రేమలో మునిగితేలుతున్న ఈ ప్రేమజంట త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోంది అంటూ బీటౌన్ మీడియా మొత్తం కోడై కూస్తోంది. గత నాలుగైదు రోజులుగా ఈ జంట గురించి సోషల్ మీడియాలో ఈ జంట పెళ్లి హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉంటే పెళ్లికి ముందే తాజాగా ఈ జంట పై ఒక పోలీసు కేసు పడిందట.

ఈ జంట పెళ్లి కోసం జైపూర్ లోని హోటల్ సిక్స్ సెన్సెస్ బర్వారా కోటలో జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ పెళ్లికి పలువురు సెలబ్రిటీలు వస్తున్నట్లు తెలుస్తోంది. దీనికోసం వారి భద్రత తదితర సమస్యల దృష్ట్యా హోటల్ కు వచ్చే మార్గాన్ని ఈ నెల 6 నుంచి 12వ తేదీ వరకూ క్లోజ్ చేశారు. అయితే అక్కడ స్థానికంగా ఉన్న చౌత్ మాత ఆలయానికి వెళ్లాలి అంటే ఆ మార్గం గుండానే వెళ్ళవలసి ఉంటుంది.

ఆ గుడికి వెళ్లడానికి కేవలం అదొక మార్గం తప్ప వేరే మార్గం లేదు. అలాంటి రోడ్డును క్లోజ్ చేయడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. దీనితో నేత్ర బింద్ సింగ్ జాడోన్ అనే లాయర్ విక్కీ కౌశల్, కత్రినాకైఫ్ లతో పాటుగా వీరి పెళ్లి జరగనుంది హోటల్ యాజమాన్యంపై కూడా పోలీస్ కేసు పెట్టాడు. ఈ కేసులో స్థానిక ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నారు అంటూ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ పెళ్లికి ఇరువురి కుటుంబ సభ్యులతో పాటు పలువురు సన్నిహితులు అలాగే బాలీవుడ్ స్టార్లు అయినా కరణ్ జోహార్, ఫరాఖాన్, అలీ అబ్బాస్ జాఫర్, కబీర్ ఖాన్, మినీ మాథుర్, రోహిత్ శెట్టి తదితర ప్రముఖులు ఈ పెళ్లికి హాజరు కానున్నట్లు సమాచారం.ఈ పెళ్లి అతి కొద్దిమంది సమక్షంలో జరగనున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఈ పెళ్ళికి కోట్లు ఖర్చు చేస్తారు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి.