సినిమా ఫ్లాప్.. కార్తికేయ క్షమాపణ అడుగుతున్నాడు

హీరో కార్తికేయ ఎన్ని ఆశలతో చేసిన చిత్రం ‘చావు కబురు చల్లగా’. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ఫ్లాప్ అయింది. పాటలు, ట్రైలర్ బాగున్నా కూడ సినిమా దెబ్బకొట్టేసింది. కార్తికేయ అయితే ఈ చిత్రం మీద బోలెడన్ని ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమతో మంచి బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకోవచ్చని ఎదురుచూశాడు. కానీ పరాజయం ఎదురైంది. అయితే సినిమాలో అతని నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఎన్నో హోప్స్ పెట్టుకుని చేసిన సినిమా ఫ్లాప్ కావడం కార్తికేయను సైతం బాధిస్తున్నట్టుంది.

అందుకే ప్రేక్షకులకు ఒక మెసేజ్ ఇచ్చాడు. ‘చావు కబురు చల్లగా’ చిత్రం నాలోని కొత్త నటుడ్ని బయటకు తీసింది. నా మనసుకు బాగా దగ్గరైంది. మీ సందేశాలన్నీ చదివాక బస్తీ బాలరాజు పాత్ర చేయడం గర్వంగా అనిపించింది. సినిమా నచ్చని అందరూ చిన్న తప్పులున్నా క్షమించేసి ఇంకొక అవకాశం ఇవ్వండి. తప్పకుండా సరిచేసుకుంటాను అంటూ ట్విట్టర్లో రాసుకొచ్చారు. కార్తికేయ ఇలా సినిమా పరాజయాన్ని ఒప్పుకోవడం, తప్పుల్ని సరిదిద్దుకుంటాను అంటూ బాహాటంగా చెప్పడం అభినందించదగిన విషయమే.