Kareena Kapoor: బాలీవుడ్ లో కరోనా కలకలం

Kareena Kapoor and Amrita Arora have tested positive for coronavirus

Kareena Kapoor: కరోనా రెండో వేవ్ ప్రభావం తగ్గిపోవటంతో ప్రజలందరూ మెల్లగా పూర్వ జీవనశైలికి వచ్చేశారు. కరోనా కరుమరుగైందన్నట్లుగా పార్టీలు, ఫంక్షన్ లు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఒక పక్క ఓమిక్రాన్ తరుముకొస్తుందని సంకేతాలు వస్తున్నా ప్రజలు అప్రమత్తం కాకుండా ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. ఇటీవల దేశంలో కొన్ని రోజులగా వైరస్ బాధితుల సంఖ్య పెరుగుతుండటం మూడో వేవ్ తప్పదన్న ఆందోళన కలిగిస్తుంది.

తాజాగా బాలీవుడ్ లో కరోనా కలకలం రేగింది. బాలీవుడ్ హీరోయిన్స్ కరీనా కపూర్, అమృతా అరోరాలకు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. ఈ ఇద్దరు గత కొన్ని రోజులుగా పలు పార్టీలలో పాల్గొన్నట్లుగా సమాచారం. దీంతో వీరిరివురికి సన్నిహితులైన వారందర్ని కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని ముంబై అధికారులు ఆదేశించారు. ప్రస్తుతానికి వీరు హోమ్ క్వారంటైన్ లో ఉన్నారట.

కరీనా ఎప్పుడు కోవిడ్ మార్గదర్శకాలను పాటిస్తుందని, ఆమె తన సినిమా, యాడ్ షూట్‌ ల సమయంలో కూడా బాధ్యతాయుతంగా ఉండేదని కరీనా మేనేజర్ మీడియాకు తెలిపారు. ఇటీవల జరిగిన పార్టీలో ఒకరు అనారోగ్యాంగా ఉన్నప్పటికీ అందరితోనూ సన్నిహితంగా మెలగటం వలనే ఇలా జరిగిందని వివరించారు. ఈ విషయంలో కరీనాను నిందించరాదని కోరారు. మహారాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు పద్దెనిమిది ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి, ఏడుగురు ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారని సమాచారం. ముంబై నగరంలో ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్నందున పెద్ద సమావేశాలను ప్రభుత్వం నిషేదించింది.