13మంది అసిస్టెంట్ డైరెక్టర్లకు ఖరీదైన బైక్స్ గిఫ్ట్ గా ఇచ్చిన కమల్.. ఫోటో వైరల్!

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ తాజాగా నటించిన చిత్రం విక్రమ్. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 3వ తేదీ విడుదల అయ్యి, విడుదలైన రెండు రోజులకే ఏకంగా వంద కోట్ల క్లబ్ లో చేరింది. ఈ క్రమంలోనే గత కొన్ని సంవత్సరాల నుంచి ఏ విధమైనటువంటి హిట్ సినిమాలు లేక సతమతమవుతున్న కమల్ హాసన్ కి విక్రమ్ సినిమా భారీ విజయాన్ని అందించిందని చెప్పాలి. ఇక పోతే ఎంతో అద్భుతమైన సినిమాని అద్భుతంగా తెరకెక్కించి విజయానికి దోహదపడిన డైరెక్టర్ లోకేష్ కి కమల్ హాసన్ ఏకంగా కోటి రూపాయలు ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చారు.

ఈ క్రమంలోనే ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇకపోతే తాజాగా ఈ సినిమా కోసం పనిచేసిన 13 మంది అసిస్టెంట్ డైరెక్టర్లకు కూడా కమల్ హాసన్ ఊహించని విధంగా సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ సినిమా ఇంత మంచి విజయాన్ని అందుకుంది అంటే అందుకు కారణం వీళ్ళు పడిన శ్రమ అని చెప్పాలి. ఈ క్రమంలోనే వీరి శ్రమకు తగ్గ ప్రతిఫలం అందుకోవడంతో కమల్ హాసన్ 13 మంది డైరెక్టర్లకు ఊహించని విధంగా వీరికి అపాచీ ఆర్‌టీఆర్‌ 160 బైక్స్ బహుమతిగా ఇచ్చారు.

ఈ బండి ధర ఒక్కొక్కటి రూ.1.45 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు.ఈ విధంగా విక్రమ్ సినిమా కోసం కష్టపడి ఎంతో శ్రమించిన డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్లకు కమల్ హాసన్ ఇలా ఊహించని విధంగా గిఫ్ట్ ఇస్తూ అందరిని సంతోష పరిచారు.ఇకపోతే ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమాకి సీక్వెల్ చిత్రం కావాలని అభిమానుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ రావడంతో ఈ సినిమాకి సీక్వెల్ చిత్రం తప్పకుండా వస్తుందని కమల్ హాసన్ విక్రమ్ సినిమా సీక్వెల్ గురించి క్లారిటీ ఇచ్చారు.