విక్రమ్ విజయవంతం కావడంతో థియేటర్ ఓనర్స్ కి విందు భోజనం ఏర్పాటు చేసిన కమల్?

కమల్ హాసన్ గత నాలుగు సంవత్సరాల నుంచి బాక్సాఫీస్ వద్ద ఏ విధమైనటువంటి హిట్ లేక ఎంతో సతమతమవుతున్నారు. ఈ క్రమంలోనే లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన విక్రమ్ సినిమా ద్వారా జూన్ 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించిన దాని కన్నా ఎంతో మంచి విజయం అందుకుంది.ఈ క్రమంలోనే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్లను రాబట్టడంతో కమల్ హాసన్ ఎంతో సంతోషంగా ఉన్నారు.ఇక చాలా సంవత్సరాల తర్వాత మంచి విజయాన్ని అందుకోవడంతో ఈయన చిత్ర బృందానికి ఖరీదైన కానుకలు ఇచ్చారు.

ఇప్పటికే దర్శకుడు లోకేష్, 13 మంది అసిస్టెంట్ డైరెక్టర్లకు ఈయన ఖరీదైన కారు బైక్స్ కానుకగా ఇచ్చారు. ఇలా ఈ సినిమా మంచి విజయం కావడంతో పెద్ద ఎత్తున విజయోత్సవ కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా కమల్ హాసన్ పాల్గొన్నటువంటి మీడియా ప్రతినిధులకు, చిత్ర బృందానికి, థియేటర్ ఓనర్స్, డిస్ట్రిబ్యూటర్లకు ఘనంగా విందు భోజనం ఏర్పాటు చేశారు.

వివిధ రకాల ఆహార పదార్థాలతో కమల్ హాసన్ చిత్ర బృందానికి ఎంతో ఘనంగా భోజనాలు ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా జూన్ 3వ తేదీ పలు భాషలలో విడుదల మొదటి షో తోనే ఎంతో మంచి విజయాన్ని అందుకుంది. కేవలం 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా దాదాపు 350 కోట్ల కలెక్షన్లను సాధించినట్లు తెలుస్తోంది.ఈ విధంగా కమల్ హాసన్ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమాకి దర్శకత్వం వహించిన లోకేష్ పేరు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.