Dhee: ఢీ డాన్స్ షో నుంచి కోపంగా వెళ్లిపోయిన జానీ మాస్టర్.. కారణం అదేనా?

Dhee: బుల్లి తెర పై గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రసారమవుతూ ఎంతోమందిని డాన్సర్లుగా తీర్చిదిద్దిన ఢీ కార్యక్రమం ద్వారా ఎంతోమంది ఇండస్ట్రీకి కొరియోగ్రాఫర్ గా పరిచయమయ్యారు.ప్రస్తుతం ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్ గా ఎంతో మంచి గుర్తింపు పొందిన జానీ మాస్టర్ శేఖర్ మాస్టర్ వంటి వాళ్లు సైతం ఢీ వేదిక నుంచి వచ్చిన వాళ్ళని చెప్పాలి.ఇకపోతే ఈ కార్యక్రమానికి గతంలో శేఖర్ మాస్టర్ న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. అయితే ప్రస్తుతం ఈయన తప్పుకోవడంతో జానీ మాస్టర్ ఈ కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు.

ఇక ఈ కార్యక్రమం ద్వారా కంటెస్టెంట్ లు ప్రతివారం విభిన్నమైన కాన్సెప్ట్ ఎంపిక చేసుకొని అద్భుతమైన ఫర్ఫార్మెన్స్ చేస్తూ ప్రేక్షకులను సందడి చేస్తుంటారు. ఇకపోతే తాజాగా వచ్చే వారం ప్రసారం కాబోయే కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.ఈ ప్రోమోలో భాగంగా కంటెస్టెంట్ ల పర్ఫామెన్స్ పై జానీ మాస్టర్ ఎంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కంటెస్టెంట్ పర్ఫామెన్స్ అనంతరం జానీ మాస్టర్ మాట్లాడుతూ ‘ఢీ’ షో అంటే ఎంతో పవర్ ఫుల్ షో అని.. అలాంటి షో లో ఇలాంటి డాన్స్ చేయడం ఏంటి అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ క్రమంలోనే ఆయన కంటెస్టెంట్ ల పర్ఫామెన్స్ పై కోపం వ్యక్తం చేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. మీ ఫర్ఫార్మెన్స్ మీ కొరియోగ్రఫీ ఏమాత్రం నచ్చలేదు.మీరు ఫ్యూచర్ లో అయినా బాగా చేస్తారని అనుకుంటున్నాను. మీరు ఇలాంటి ఫర్ఫార్మెన్స్ చేస్తే మరోసారి నేను ఇక్కడికి రావాలని అనుకోవడం లేదు అంటూ ఈయన కోపంగా వెళ్లిపోయారు. ఇలా జానీ మాస్టర్ షో నుంచి వెళ్లిపోవడంతో ఈ విషయం కాస్త హాట్ టాపిక్ గా మారింది. అయితే జానీ మాస్టర్ ను ఇలా అసంతృప్తికి గురి చేసిన కంటెస్టెంట్ ఎవరు ఏంటి అనే విషయం తెలియాలంటే వచ్చే వారం వరకు వేచి చూడాలి.