Bhalakrishana: బాలకృష్ణ తర్వాత చిత్రంలో సందడి చేయనున్న జయమ్మ.. అధికారికంగా ప్రకటించిన చిత్ర బృందం!

Bhalakrishana: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండ సినిమా విజయోత్సవంలో ఉన్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇదిలా ఉండగా బాలకృష్ణ తన తర్వాత సినిమా గురించి పెద్దఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే బాలకృష్ణ తన 150వ చిత్రాన్ని క్రాక్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పటికే ఈ చిత్రం పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకి సంబంధించిన సమాచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో బాలకృష్ణ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న విషయాన్ని చిత్రబృందం వెల్లడించారు. ఇకపోతే ఈ సినిమాలో మరొక కీలకమైన పాత్రలో క్రాక్ సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ మరోసారి బాలకృష్ణ సినిమాలో సందడి చేయబోతున్నారనే విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించారు.

గత ఏడాది క్రాక్ సినిమా ద్వారా జయమ్మ పాత్రలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె మరోసారి గోపీచంద్ దర్శకత్వంలో ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమైంది. ఇకపోతే ఈ సినిమాలో బాలకృష్ణతో పోటీ పడటం కోసం కన్నడ హీరో దునియా విజయ్ ను రంగంలోకి దింపుతూ అధికారిక ప్రకటన చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇలా ఈ సినిమాలో స్టార్ సెలబ్రిటీలు అందరూ నటించడంతో ఈ సినిమాపై రోజురోజుకు అంచనాలు పెరుగుతున్నాయి.