రానా విరాటపర్వం సినిమాలో నటించటానికి కారణం అదేనా.. వారికోసమే నటించారా?

శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన లీడర్ సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన దగ్గుబాటి వారసుడు దగ్గుబాటి రానా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగుతో పాటు హిందీ సినిమాల్లో కూడా నటించి భల్లాల దేవుడి గా మంచి గుర్తింపు పొందాడు. రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి సినిమాలో భల్లాల దేవుడి పాత్రలో నటించిన ఆ సినిమా ద్వారా మరింత క్రేజ్ సంపాదించుకున్నాడు. రానా కేవలం నటుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా సక్సెస్ అయ్యాడు. అంతే కాకుండా నెంబర్ 1 యారి అనే షో కి కూడా హోస్ట్ గా వ్యవహరించి బుల్లితెర ప్రేక్షకులకి కూడా బాగా దగ్గరయ్యాడు.

ఇదిలా ఉండగా ప్రస్తుతం రానా విరాటపర్వం సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో రానాకి జోడి గా న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి నటిస్తోంది. ఈ సినిమాకి వేణు ఊడుగుల దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమాకి సంబందించిన ఆత్మీయ వేడుక వరంగల్ లో జరిగింది. ఈ వేడుకకు పలువురు రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు. విరాట పర్వం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆదివారం సాయంత్రం వరంగల్ లో ఏర్పాటు చేసిన ఈ వేడుకకు హీరో రానా, డైరెక్టర్ తో పాటు ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ , ఎంపీ పసునూరి దయాకర్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన ఈ ఆత్మీయ వేడుకలో రానా మాట్లాడుతూ..” ఒక సినిమా కథ మనిషిని మార్చుతుందా అంటే.. కచ్చితంగా మనం చేసే కథ మనల్ని మారుస్తుందని చెబుతాను. నేను నటించిన ప్రతీ పాత్రకు సంబంధించిన ఏదో ఒక అంశం నాలో ఉంది. చాలామంది ఈ సినిమా ఎందుకూ చేస్తున్నారు. ఏదైనా యాక్షన్ సినిమా చేయచ్చు కదా అని అడుగుతున్నారు. సాధారణంగా నటీనటులు ప్రేక్షకుల అభిమానం కోసం వారి చపట్ల కోసం సినిమాలు చేస్తూ ఉంటారు. కానీ ఆ చప్పట్ల మధ్యలో నిశ్శబ్ధంగా కూర్చుని ఈ సినిమాలో చెప్పినది నిజమే కదా అని నమ్మి ఒకరు సినిమాను చూస్తుంటారు.. వాళ్ల కోసం నేనూ ఈ సినిమా చేశాను. అంటూ రానా చెప్పుకొచ్చాడు. జూన్ 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మీ అందరి ప్రేమ కావాలి.. మళ్లీ సక్సెస్ మీట్ కు ఇక్కడికే వస్తాం” అంటూ రానా చెప్పుకొచ్చారు.