YS Jagan : ఈ లెక్కన ఏపీ సీఎం దగ్గర చిరు, మహేష్, ప్రభాస్ లకి అవమానం జరిగిందా?

YS Jagan : ఇప్పుడు ఎందుకో గాని టాలీవుడ్ చుట్టూతా రాజకీయ రంగు బాగా పులుముకుంటుంది అనే మాట వాస్తవం. అయితే ఇది ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్లి ఆగుతుందో కూడా అర్ధం కాని పరిస్థితి ఇప్పుడు నెలకొంది. మరి గత కొంత కాలం నుంచి ఏపీలో టికెట్ ధరల ఇష్యూ అలా తీరని సమస్యగా కొనసాగుతూ వస్తుంది.
ఇక దీనిపై ఫైనల్ గా టాలీవుడ్ నుంచి పెద్ద తారలు మెగాస్టార్ చిరంజీవి సహా సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంకా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దగ్గరకి వెళ్లారు. అయితే ఇప్పుడు ఒక షాకింగ్ అంశం సినీ వర్గాల్లో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఈ హీరోలను జగన్ తన వద్దకు పిలిపించి అవమానపరిచినట్టు అయ్యింది అని వారి అభిమానులు అంటున్న మాట.
అయితే అసలు మేటర్ లోకి వెళ్లినట్లు అయితే బాలయ్య  తన సినిమా కోసం జగన్ ని సంప్రదించే ప్రయత్నం చేయగా ఆ సమయంలో జగన్ బాలయ్య ను మన దగ్గరకి రప్పించుకోడం ఏంటి వారి సినిమా ని వదిలేయాలని సూచించినట్లు గా మంత్రి పేర్ని నాని సంచలన కామెంట్స్ చేశారు. దీనితో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది అసలు రచ్చ.
అంటే బాలయ్య సినిమాకి తమ దగ్గరకి వస్తా అన్నా రానివ్వరు కానీ మెగాస్టార్ మహేష్ ప్రభాస్ లాంటి హీరోలను తమ వద్దకు పిలిపించుకోవడంలో అర్ధం ఏమిటి అని వారి అభిమానుల ప్రశ్న. అంటే తమ హీరోలని అవమానించినట్టు కాదా అని కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరి ప్రస్తుతం అయితే ఏపీలో కొత్త టికెట్ ధరలుకి సంబంధించి కొత్త జీవో మరో వారం లో రానున్నట్లు సమాచారం.