టీమిండియా వన్డే జట్టులో ఎన్నేళ్లుగా నమ్మకమైన ఆల్రౌండర్గా కొనసాగిన రవీంద్ర జడేజా భవితవ్యంపై ఇప్పుడు సందేహాలు మొదలయ్యాయి. న్యూజిలాండ్తో జరుగుతున్న వన్డే సిరీస్లో అతడి ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేకపోవడంతో, జట్టులో అతడి స్థానం ఇక భద్రమా. అనే చర్చ జోరుగా నడుస్తోంది. ముఖ్యంగా యువ ఆటగాళ్ల రాకతో పోటీ పెరగడం జడేజాకు మరింత సవాలుగా మారింది.
రాజ్కోట్లో జరిగిన రెండో వన్డేలో జడేజా తన సొంత మైదానంలోనే అభిమానులను నిరాశపరిచాడు. కీలక సమయంలో బ్యాటింగ్కు వచ్చిన అతడు మ్యాచ్ వేగానికి తగ్గట్టుగా ఆడలేకపోయాడు. బంతుల్ని ఎక్కువగా వినియోగించినప్పటికీ స్కోర్బోర్డును ముందుకు నడిపించడంలో విఫలమయ్యాడు. బౌలింగ్లోనూ ప్రభావం చూపలేకపోవడం టీమిండియా ఓటమికి ఒక కారణంగా మారింది. ఈ సిరీస్లో ఇప్పటివరకు వికెట్ ఖాతా కూడా తెరవకపోవడం విమర్శలకు తావిచ్చింది.
ఈ ప్రదర్శనపై మాజీ క్రికెటర్లు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆధునిక వన్డే క్రికెట్లో ఆల్రౌండర్ పాత్ర పూర్తిగా మారిపోయిందని, కేవలం నిలబడటం కాదు.. వేగంగా పరుగులు రాబట్టడం కూడా కీలకమని వారు అభిప్రాయపడుతున్నారు. రీబిల్డింగ్ దశలో ఉన్న జట్టులో అనుభవం ఉన్న ఆటగాడు మరింత బాధ్యత తీసుకోవాల్సిందని విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా 2025 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత జడేజా వన్డే గణాంకాలు ఆందోళన కలిగించేలా ఉన్నాయని క్రికెట్ వర్గాల్లో చర్చ సాగుతోంది.
ఇదే సమయంలో జడేజాకు ప్రత్యామ్నాయంగా అక్షర్ పటేల్ పేరు బలంగా వినిపిస్తోంది. అతడికి లభించిన అవకాశాల్లో స్థిరంగా రాణిస్తూ జట్టు యాజమాన్యాన్ని ఆకట్టుకుంటున్నాడు. కట్టుదిట్టమైన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్తో రన్స్ కట్టడి చేయడమే కాకుండా, అవసరమైనప్పుడు బ్యాటింగ్లో వేగంగా పరుగులు సాధించగలగడం అతడి బలం. ఫీల్డింగ్లోనూ చురుకైన కదలికలతో అదనపు పరుగులను అడ్డుకుంటూ మ్యాచ్పై ప్రభావం చూపుతున్నాడు.
మూడు వన్డేల సిరీస్ ప్రస్తుతం 1-1తో సమంగా ఉండటంతో, ఇండోర్లో జరగనున్న చివరి మ్యాచ్ మరింత కీలకంగా మారింది. ఈ మ్యాచ్లో జడేజా తన అనుభవంతో జట్టుకు మ్యాచ్ విన్నర్గా నిలుస్తాడా? లేక అక్షర్ పటేల్ యుగానికి ఇది ఆరంభ సంకేతమా? అన్నది ఆసక్తికరంగా మారింది. వన్డే జట్టులో చోటు నిలబెట్టుకోవాలంటే పేరుకే కాదు, ప్రదర్శనతోనే సమాధానం చెప్పాల్సిన పరిస్థితిలో జడేజా ఉన్నాడు.
