చెన్నైపై 6 వికెట్ల తేడాతో లఖ్​నవూ సూపర్ జెయింట్స్ గెలుపు

చెన్నై‌పై లఖ్​నవూ సూపర్ జెయింట్స్​ విజయం సాధించింది. ఐపీఎల్​ 15వ సీజన్​లో​ తొలి విజయాన్ని ఖాతాలో వేసుకుంది. 211 పరుగుల భారీ లక్ష్యంతో దిగిన లఖ్​నవూ జట్టు బ్యాట్స్‌మెన్స్ కెప్టెన్​ రాహుల్​(40), క్వింటన్​ డికాక్​(61),ఎవిన్ లూయిస్‌ (55*) విజృభించడంతో సూపర్ విజయాన్ని అందుకుంది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన చెన్పై శివమ్ దుబె(30 బంతుల్లో 49), అంబయి రాయుడు(27), రవీంద్ర జడేజా(17), ఆఖర్లో ధోనీ(16) రాణించడం వల్ల 210 పరుగులు చేసింది