ఇంట్రెస్టింగ్ అప్డేట్ : థియేటర్స్ మోత మోగేలా “సర్కారు వారి పాట”.!

టాలీవుడ్ ఆల్ టైం హ్యాండ్సమ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తీ సురేష్ హీరోయిన్ గా దర్శకుడు పరశురామ్ పెట్ల తీస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా “సర్కారు వారి పాట”. మంచి అంచనాలు ఉన్న ఈ సినిమా ఇప్పుడు షూటింగ్ 90 శాతంకి అలా చేరుకుంది. అయితే ఈ సినిమాపై ఓ ఇంట్రెస్టింగ్ సమాచారం ఇప్పుడు తెలుస్తుంది. ఈ సినిమాలో డైలాగ్స్ మాత్రం ఊరమాస్ గా ఉంటాయట.

పక్కా నాటుగా థియేటర్స్ లో అన్ని సెంటర్ల ప్రేక్షకులు విజిల్ కొట్టే రేంజ్ లో థియేటర్స్ మోత మోగేలా డైలాగ్స్ ని చిత్ర దర్శకుడు పరశురామ్ పెట్ల డిజైన్ చేసాడట. షూటింగ్ టైం లోనే ఇవి అదిరే స్థాయిలో వచ్చాయట. ఇక వెండితెరపై అదరగొట్టడమే బాకీ ఉందని మహేష్ దగ్గర సోర్సెస్ చెబుతున్నాయి. దీనిని బట్టి ఈ సినిమాలో ఎలాంటి డైలాగ్స్ ఉన్నాయో ఊహించవచ్చు. ఇక ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 1న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.