యంగ్ హీరో శర్వానంద్ సైన్ చేసిన సినిమాల్లో తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం కూడ ఉంది. ఈ చిత్రాన్ని శ్రీకార్తీక్ డైరెక్ట్ చేస్తున్నారు. 2019 ఆగష్టు నెలలో ఈ చిత్రం మొదలైంది. కానీ లాక్ డౌన్ కారణంగా షూటింగ్ ఆగిపోయింది.
దీంతో గతేడాది వేసవిలోనే రిలీజ్ కావాల్సింది నిలిచిపోయింది. 2020లో కాస్త చిత్రీకరణ జరిపి మిగిలిన భాగాన్ని ఇటీవలే ముగించారు. ఈ చిత్రంలో శర్వానంద్ జోడీగా రీతు వర్మ నటిస్తోంది. కంప్లీట్ లవ్ ఎంటర్టైనర్ ఇది. ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్, టైటిల్ ఈరోజు సాయంత్రం రివీల్ చేయనున్నారు.
అయితే చిత్ర సన్నిహిత వర్గాల సమాచారం మేరకు ‘ఒకే ఒక జీవితం’ అనేది సినిమా టైటిల్ అని తెలుస్తోంది. ఇందులో అమల అక్కినేని, వెన్నెల కిశోర్, ప్రియదర్శి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై యస్.ఆర్.ప్రభు, యస్.ఆర్ ప్రకాశ్బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమిళ ప్రేక్షకులకి శర్వానంద్ కాస్త పరిచయం ఉన్న నటుడే.
రీతు వర్మకు కూడ తమిళంలో మంచి క్రేజే ఉంది. కాబట్టి ఈ చిత్రాన్ని అక్కడ కూడ మంచి మార్కెట్ చేయాలని చూస్తున్నారు నిర్మాతలు. ఇది కాకుండా శర్వానంద్ అజయ్ భూపతి దర్శకత్వంలో ‘మహా సముద్రం’, కిశోర్ తిరుమల డైరెక్షన్లో ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ లాంటి చిత్రాలు చేస్తున్నారు.