ఆ స్టార్ డైరెక్టర్ ను ఏఎన్నార్ అవమానించారా.. షాకింగ్ విషయాలు రివీల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఒక వెలుగు వెలిగిన హీరోలలో అక్కినేని నాగేశ్వరరావు ఒకరనే సంగతి తెలిసిందే. ఏఎన్నార్ సినీ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఉండగా తన సినిమాలలో ఎంతోమంది కొత్త నటులకు అవకాశం ఇచ్చిన వాళ్లలో ఏఎన్నార్ ఒకరు కావడం గమనార్హం. కుటుంబ కథా చిత్రాలలో ఎక్కువగా నటించి విజయాలను అందుకున్న హీరోలలో ఏఎన్నార్ ఒకరు కాగా ఏఎన్నార్ హీరోగా తెరకెక్కిన సినిమాలలో దాంపత్యం ఒకటి.

దాంపత్యం సినిమాకు కోదండరామిరెడ్డి దర్శకుడు కావడం గమనార్హం. చదలవాడ సోదరులు ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ సినిమాకు సంబంధించిన పాటలో ఒక పదం ద్వందార్థంతో ఉండటంతో అక్కినేని ఫేస్ లో మార్పులు వచ్చాయి. అయితే కోదండరామిరెడ్డి మాత్రం ఆ పదాన్ని అలానే ఉంచినా సినిమాకు నష్టం కలగదని భావించారు. డైరెక్టర్ పై సీరియస్ అయిన ఏఎన్నార్ కోపంతో విగ్ తీసి నేలకు విసిరి కొట్టారు.

షూటింగ్ తొలిరోజున ఈ విధంగా జరగడంతో అక్కడికి హాజరైన ఇతర సెలబ్రిటీలు, జర్నలిస్ట్ లు షాకయ్యారు. ఆ విధంగా జరగడాన్ని కోదండరామిరెడ్డి అవమానంగా ఫీలయ్యారు. సత్యమూర్తి ఈ సినిమాకు కథ అందించగా జయసుధ, సుహాసిని ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. ఆ తర్వాత ఈ సినిమాలో తాను నటించనని ఏఎన్నార్ చెప్పారు. మద్రాస్ లో షూటింగ్ చేయడం కూడా ఏఎన్నార్ కోపానికి ఒక కారణమని తెలుస్తోంది.

అయితే కొన్నిరోజుల తర్వాత ఏఎన్నార్ కోదండరామిరెడ్డిని కలిసి సారీ చెప్పి దాంపత్యం సినిమా చేశారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా సక్సెస్ సాధించింది. ఈ సినిమాలో ఏఎన్నార్ నటనకు కోదండరామిరెడ్డి దర్శకత్వ ప్రతిభకు మంచి మార్కులు పడ్డాయి. నిర్మాతలకు ఈ సినిమా కళ్లు చెదిరే స్థాయిలో లాభాలను అందించడం గమనార్హం.