ఇంద్రజ కూడా వారి బాటలోనే ఆ అవకాశం కోసం ఎదురు చూస్తుందా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రనటిగా ఒకానొక సమయంలో ఓ వెలుగు వెలిగిన నటి ఇంద్రజ కొంతకాలానికి ఇండస్ట్రీకి దూరమైన ప్రస్తుతం తిరిగి ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ విధంగా ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ప్రస్తుతం వరుస బుల్లితెర కార్యక్రమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే బుల్లితెర పై ప్రసారం అవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమం ద్వారా ప్రేక్షకులను సందడి చేసేవారు.ఈ విధంగా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా సుడిగాలి సుదీర్ ఇంద్రజ తల్లీకొడుకులు రిలేషన్ లో ఉంటూ ప్రేక్షకులకు పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు.ఇకపోతే జబర్దస్త్ కార్యక్రమం నుంచి రోజా తప్పుకోవడంతో ఈ కార్యక్రమానికి కూడా ఇంద్రజ రోజా స్థానంలో న్యాయనిర్ణేతగా కొనసాగుతున్నారు.

జబర్దస్త్ డ్రామా కంపెనీ కార్యక్రమాలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. అయితే గత వారం శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో గత వారం సుడిగాలి సుదీర్ తప్పుకున్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో గతవారం ఇంద్రజ స్థానంలో నటి పూర్ణ జడ్జిగా హాజరయ్యారు. ఇకపోతే ఇంద్రజ కూడా శ్రీదేవి తమ కంపెనీ కార్యక్రమానికి దూరమవుతారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.ఇకపోతే ప్రస్తుతం జబర్దస్త్ కార్యక్రమం లో ఈమె జడ్జిగా కొనసాగుతున్నప్పటికీ ఇకపై కొనసాగలేరని తెలుస్తోంది.

జబర్దస్త్ కార్యక్రమం నుంచి సుడిగాలి సుధీర్ గెటప్ శీను హైపర్ ఆది వంటి వారు తప్పుకోవడంతో ఈ కార్యక్రమంలో పరిస్థితులు మారిపోయాయి. దీంతో ఇంద్రజ కూడా ఎక్కువ కాలము ఉండలేరని తెలుస్తోంది. ఇకపోతే ఇంద్రజ కూడా సుడిగాలి సుధీర్ బాటలోనే వేరొక ఛానల్లో అవకాశం వస్తే వెళ్లడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సుడిగాలి సుదీర్ ఈ టీవీకి దూరమై పూర్తిగా మాటీవీకి దగ్గరయ్యారు. ఈ క్రమంలోనే ఇంద్రజ సైతం వీరి బాటలోనే వేరే ఛానల్ లో అవకాశం వస్తే వెళ్తారనే వార్తలు పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతున్నాయి.