Crime News: తమిళనాడులో దారుణం.. కోరిక తీర్చలేదని తల్లీకూతుళ్లను దారుణంగా నరికి…!

Crime News: ఈ మధ్యకాలంలో మహిళలు, యువతుల మీద అత్యాచారం ఘటనలు రోజు రోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి. మహిళలు చిన్న పిల్లలు ఒంటరిగా బయటికి వెళ్ళాలి అంటే భయపడాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. కొందరు దుర్మార్గులు వారి కామవాంఛలు తీర్చుకోవడానికి అమాయకులైన మహిళలను బలి తీసుకుంటున్నారు. ప్రభుత్వాలు మహిళలను రక్షించడానికి ఎన్ని కఠిన చర్యలు చేపట్టిన కూడా ఇటువంటి దుర్మార్గుల ఆగడాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ఇటీవల తమిళనాడులో ఇటువంటి దారుణ సంఘటన చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే…దిండిగల్లు జిల్లా పెరియమలైయూర్‌ వలసైకి చెందిన శివకుమార్‌ అనే వ్యక్తి అంజలై అనే యువతిని రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు మలర్‌విళి అనే కుమార్తె కూడా ఉంది. వీరి పెళ్లి జరిగినప్పటి నుండి శివకుమార్ సోదరుడు అంజలై నీ లైంగిక వేధింపులకు పాల్పడేవాడు. అతని బాధ భరించలేక వీరిద్దరు వేరు కాపురం పెట్టారు. ఈ క్రమంలో అంజలై శనివారం సాయంత్రం మేకలను మేపడానికి కూతురితో సహా అడవికి వెళ్ళింది. సాయంత్రం కావస్తున్నా కూడా ఇద్దరు ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు వారిని వెతకటానికి అడవికి వెళ్ళారు.

తల్లి, బిడ్డ కోసం వెతుకుతున్న క్రమంలో ఒక ప్రదేశంలో ఇద్దరూ కాలిన స్థితిలో విగత జీవులుగా కనిపించారు. ఈ ఘటన గురించి బంధువులు సమాచారం ఇవ్వగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. శివకుమార్ సోదరుడు కరుప్పయ్య మీద అనుమానం ఉన్నట్టు బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు కరుప్పయ్య ను పోలీసులు అదుపులోకి తీసుకొని అతడిని విచారించారు. తన కోరిక తీర్చమని పలుమార్లు అంజలై నీ కోరిన ఆమె నిరాకరించడంతో మేకలు మేపటానికి వెళ్లిన తల్లి, కూతురు మీద వేటకొడవళ్లతో దాడి చేసి తర్వాత శవాలకు నిప్పు పెట్టినట్లు శివకుమార్ సోదరుడు అంగీకరించాడు. దీంతో పోలీసులు అతని మీద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.