అలియా భట్ చిటికేస్తే కోట్లే !

ప్రస్తుతం సోషల్ మీడియా అభివృద్ధి చెందడంతో ప్రతి ఒక్క సెలబ్రిటీ కూడా సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇలా సోషల్ మీడియా వేదికగా విపరీతమైన అభిమానులను సంపాదించుకున్న సెలబ్రిటీలు వారికి సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని కూడా అభిమానులతో పంచుకుంటారు అలాగే పలు కంపెనీలకు చెందిన బ్రాండ్లను కూడా సోషల్ మీడియా వేదికగా ప్రమోట్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా వారి కంపెనీలకు చెందిన పలు ఉత్పత్తులను ప్రమోట్ చేయడం కోసం కొందరు సెలబ్రిటీలు పెద్ద ఎత్తున రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుంటారు.

ఈ విధంగా సోషల్ మీడియా ద్వారా కూడా కోట్లు సంపాదిస్తున్న సెలబ్రిటీలు ఉన్నారు. అలాంటి వారిలో బాలీవుడ్ నటి అలియా భట్ ఒకరు.ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగడమే కాకుండా ప్రస్తుతం హాలీవుడ్ చిత్రాలలో కూడా అవకాశాలను అందుకుంటున్నారు.అదేవిధంగా తెలుగులో కూడా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన త్రిబుల్ ఆర్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను సందడి చేశారు. ఇలాఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అలియా భట్ ఇంస్టాగ్రామ్ లో ఏకంగా 68.5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.

బాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన నటీమణులలో అలియా భట్ నాలుగవ స్థానంలో ఉంది. ఇంతటి ఫాన్స్ ఫాలోయింగ్ ఉన్న ఈమె ఒక కంపెనీ ప్రోడక్ట్ కి సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో షేర్ చేయడం కోసం భారీగా చార్జ్ చేస్తారని తెలుస్తోంది. ఇలా ఒక పోస్టుకు అలియా ఏకంగా 80 లక్షల నుంచి కోటి రూపాయలు వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని సమాచారం.మొత్తానికి ఈ సెలబ్రిటీలు కేవలం సినిమాల పరంగా మాత్రమే కాకుండా ఇలా సోషల్ మీడియా ద్వారా పలు బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ కోట్లలో డబ్బు సంపాదిస్తున్నారని చెప్పాలి.