ఉదయ్ కిరణ్ రాజమౌళితో ఆ సినిమా చేసి ఉంటే ఆయన మరణించే వారు కాదు..?

టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఏవిధమైనటువంటి సినీ నేపథ్యం లేని కుటుంబం నుంచి అడుగు పెట్టి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోలు సైతం అవాక్కయ్యేలా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు ఉదయ్ కిరణ్ గురించి అందరికీ సుపరిచితమే. చిత్రం సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఉదయ్ కిరణ్ అనంతరం వరుస సినిమాలతో దూసుకుపోతూ ఇండస్ట్రీలో అగ్ర హీరోగా కొనసాగారు. ఇలా ఈయన క్రేజ్ చూసి మెగాస్టార్ చిరంజీవి తన కూతురిని ఉదయ్ కిరణ్ కి ఇచ్చి వివాహం చేయాలని భావించారు. ఈ విధంగా తన కూతురుతో నిశ్చితార్థం జరిగినప్పటికీ , కొన్ని కారణాల వల్ల వీరి వివాహం ఆగిపోయింది.

ఇక స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి ఈయన మెల్లిమెల్లిగా వరుస ఫ్లాప్ చిత్రాలను ఎదుర్కొన్నాడు. ఇలా ఇండస్ట్రీలో అవకాశాలు లేక నటించిన సినిమాలు కూడా ఫ్లాప్ కావడంతో ఈయన ఎంతో మానసిక క్షోభకు గురై 2014 జనవరి 14వ తేదీ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో అపజయం ఎరుగని దర్శకుడుగా పేరుపొందిన రాజమౌళి దర్శకత్వంలో ఉదయ్ కిరణ్ కి ఒక సినిమా చేసే అవకాశం వచ్చింది. అయితే చివరి నిమిషంలో ఆ సినిమా వేరే హీరోతో చేసి మంచి విజయం అందుకున్నారు.

కాలేజ్ బ్యాక్డ్రాప్ లో మాస్ యాక్షన్ చిత్రంగా తెరకెక్కిన సినిమా సై. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. నిజానికి ఈ సినిమా ముందుగా ఉదయ్ కిరణ్ తో చేయాల్సి ఉంది. అయితే అనుకోని కారణాలవల్ల ఈ సినిమా ఉదయ్ కిరణ్ ని కాకుండా నితిన్ నీ వరించింది. ఒకవేళ రాజమౌళితో ఈ సినిమా కనుక చేసి ఉంటే ఈయన కెరీర్లో మంచి హిట్ సినిమా వచ్చి ఈయన మరిన్ని అవకాశాలను అందుకుని ఇండస్ట్రీలో కొనసాగే వారు. ఆత్మహత్య చేసుకునే వారు కాదని చెప్పవచ్చు.