Taapsee Pannu: అదే నిజమైతే నేనే కేకలు పెట్టి మరి ప్రకటిస్తాను.. తాప్సీ పన్ను.?

Taapsee Pannu: టాలీవుడ్ బ్యూటీ హీరోయిన్ తాప్సీ పన్ను గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మొదట ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. మొదటి సినిమాతోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకుంది ఈ బ్యూటీ. ఈ సినిమా తరువాత పలు సినిమాల్లో నటించి తన అందం అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఝుమ్మంది నాదం సినిమా తర్వాత తెలుగులో వరుస సినిమాలు దక్కించుకుంటూ అప్పట్లో టాప్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. ఆ తరువాత తెలుగులో ఈమెకు సరైన అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ ఇండస్ట్రీ కి వెళ్లి అక్కడ మంచి మంచి పాత్రలను సెలెక్ట్ చేసుకుంటూ వరుస సినిమాలతో దూసుకుపోయింది.

ఇక బాలీవుడ్ లో ఎక్కువగా గ్లామర్ కంటే నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మళ్లీ టాలీవుడ్ వైపు తిరిగి చూడలేదు. ఒక వైపు సినిమాల్లో నటిస్తూనే మరొక వైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇదిలా ఉంటే తాప్సీ బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ తో నటించే అవకాశం దక్కించుకుంది అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో హీరోగా షారుక్ ఖాన్ నటిస్తుండగా, హీరోయిన్ గా తాప్సీ నటిస్తోంది అంటూ వార్తలు వినిపించాయి. అయితే ఈ విషయంపై అధికారికంగా మాత్రం ప్రకటన రాలేదు.

ఇదే విషయంపై మొదటిసారిగా తాప్సీ పన్ను స్పందించింది. ఈ సందర్భంగా ఈ విషయంపై తాప్సీ పన్ను మాట్లాడుతూ.. ఈ వార్త కనుక నిజం అయితే అందరికంటే ముందు నేనే స్వయంగా మీకు చెబుతాను.. కాకపోతే ముందు ప్రాజెక్ట్ ఫైనల్ కానివ్వండి.. లేదంటే ఊహాగానాలుగా మాత్రమే మిగిలిపోతాయి.. ఈ విషయం కన్ఫామ్ అవ్వగానే ఇంటి పైకి ఎక్కి అందరికీ వినిపించే విధంగా కేకలు పెట్టి మరి ప్రకటిస్తానని చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. తాప్సీ పన్ను ఆ విధంగా స్పందించడంతో ఆ వార్తల్లో నిజం లేకపోలేదు అన్న రీతిలో నెటిజన్లు ఆలోచిస్తున్నారు. మరి సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఆ వార్తలు నిజంఅవుతాయా లేదా అన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే మరి.