Jeevitha Rajasekhar: అప్పుడు చనిపోతానని అనుకున్నా… ఆ బాధ ఇప్పటికీ ఉంది.. రాజశేఖర్ షాకింగ్ కామెంట్స్!

Jeevitha Rajasekhar: టాలీవుడ్ కపుల్స్ లో బెస్ట్ కపుల్ అయినా హీరో రాజశేఖర్, భార్య జీవిత ల జోడి గురించి మనందరికీ తెలిసిందే. అన్యోన్యమైన జంటలకు ఈ జంట ఒక ఉదాహరణ అని చెప్పవచ్చు. అంతేకాకుండా టాలీవుడ్ బెస్ట్ కపుల్స్ లో ఈ జంట ముందు వరుసలో ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఒకే సమయంలో సినీ కెరీర్ ను ప్రారంభించిన ఈ జంట అప్పట్లో ఎన్నో సినిమాల్లో కలిసి నటించారు. ఆ తర్వాత వారి మధ్య ప్రేమ బలపడటంతో ఒకరిపై ఒకరు ప్రేమని పెంచుకొని వైవాహిక బంధం లోకి అడుగుపెట్టాడు.

ఈ దంపతులకు ఇద్దరు కూతుర్లు ఉన్న విషయం తెలిసిందే. వారు ఒకరు శివాత్మిక, మరొకరు శివాని. జీవిత రాజశేఖర్ తన వ్యక్తిగత విషయాల పట్ల, తన కుటుంబం పట్ల, అదే విధంగా సమాజంలో జరుగుతున్న సమస్యల పట్ల తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటుంది. అంతే కాకుండా సినీ ఇండస్ట్రీని ఎవరైనా తప్పుగా మాట్లాడిన సమయంలో ఆమె ఇండస్ట్రీ తరపున మాట్లాడుతూ ఉంటుంది. ఇదిలా ఉంటే తాజాగా జీవితా రాజశేఖర్ లు ఈ టీవీలో ప్రసారం అవుతున్న ఆలీతో సరదాగా షోలో పాల్గొన్నారు. ఈ షోకి ఆలీ పోస్ట్ గా వ్యవహరించిన సంగతి మనందరికీ తెలిసిందే.

ఇక ఈ షోకి హాజరైన జీవిత, రాజశేఖర్ లను ఆలీ పలు ప్రశ్నలు వేసాడు. వారి సినీ జీవితం తో పాటు, వ్యక్తిగత విషయాలు, వారి కుటుంబ విషయాలకు సంబంధించిన సరదా ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టాడు అలీ. ఈ క్రమంలోనే ఆలీ అడిగిన ప్రశ్నలకు వారిద్దరూ కూడా తమదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ఇక ఈ సందర్భంలోనే జీవిత ఎమోషనల్ అయ్యింది. రాజశేఖర్ కు కరోనా సోకిన సమయంలో ఎలాంటి మానసిక సంఘర్షణకు తమ కుటుంబం గురైందో తలచుకొని ఎమోషనల్ అయ్యింది. అదేవిధంగా రాజశేఖర్ సైతం తాను నెలరోజులపాటు ఐసీయూలో ఆ విషయాన్ని గుర్తు చేసుకుని బాధ పడ్డారు. అనంతరం మీ ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయా అని ఆలీ ప్రశ్నించగా.. ఆ విషయంపై స్పందించిన రాజశేఖర్.. ఇలాంటి భార్య దొరకడం దేవుడిచ్చిన వరం తెలిపారు. వారసులు ఉంటే బాగుండేది అని ఎప్పుడైనా అనిపించిందా మళ్ళీ అడగాలా ఆ బాధ ఇప్పటికీ ఉంది అంటూ సమాధానం చెప్పారు.