Manchu Vishnu: నాకు 280 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు…సంచలనం రేపుతున్న విష్ణు కామెంట్స్?

Manchu Vishnu: మంచు విష్ణు ప్రస్తుతం కన్నప్ప సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు .తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయినటువంటి ఈ సినిమా ఏప్రిల్ 25వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో ఇతర భాష స్టార్ సెలబ్రిటీ లందరూ కూడా భాగమయ్యారు. అక్షయ్ కుమార్ కాజల్ అగర్వాల్ శరత్ కుమార్, శివరాజ్ కుమార్, మోహన్ లాల్, ప్రభాస్ వంటి వారందరూ కూడా నటిస్తున్నారు.

ఇక ఈ సినిమా 200 కోట్ల బడ్జెట్ తో మోహన్ బాబు నిర్మాణంలోని ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమాలో ఇలా స్టార్ సెలబ్రిటీలందరూ కూడా భాగం కావడంతో సినిమాపై ఎంతో ఆతృత నెలకొంది. ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతున్న నేపథ్యంలో మంచు విష్ణు వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. అయితే ఈ ఇంటర్వ్యూలలో భాగంగా ఈయన చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం సంచలనంగా మారాయి.

ఇటీవల తన సినిమాపై వస్తున్న ట్రోల్స్ గురించి మాట్లాడారు అలాగే ఆస్కార్ అవార్డు గురించి తెలిపారు. ఇక ప్రభాస్ ఎనర్జీ గురించి కూడా ఈయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఎమ్మెల్యేల గురించి ఈయన పొలిటికల్ కామెంట్స్ చేయడంతో ఈ వ్యాఖ్యలు కాస్త తీవ్రదుమారం రేపుతున్నాయి. ఇటీవల మరో ఇంటర్వ్యూలో భాగంగా మంచి విష్ణు మాట్లాడుతూ తనుకు 280 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని తెలిపారు.

తెలంగాణలో తనకు వంద మంది ఎమ్మెల్యేలు చాలా క్లోజ్ అలాగే ఏపీలో 160 మంది ఎమ్మెల్యేలు చాలా క్లోజ్ అని తెలిపారు. ఇక తమిళనాడులో కూడా మరో 20 మంది ఎమ్మెల్యేలు నాకు చాలా బాగా తెలుసు అంటూ ఈయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అయితే మంచు విష్ణు ఇలా తనకు 280 మంది ఎమ్మెల్యేలు తెలుసు అంటూ చెప్పడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా మంచు విష్ణు మాత్రం సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఇటీవల పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు.