అమ్మకి ఆపరేషన్ చేయించడానికి చేతిలో డబ్బులు లేక ఇబ్బంది పడ్డాను: నటి ఇంద్రజ

ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఇంద్రజ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన అందం, అభినయంతో ఎంతోమంది అభిమానాన్ని సొంతం చేసుకున్న ఇంద్రజ పలు సినిమాలలో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కొంత కాలం సినిమాలకు దూరంగా ఉన్న ఇంద్రజ బుల్లితెర మీద కూడా న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూ తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఈటీవీలో ప్రసారమవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ అనే కామెడీ షో కి ఇంద్రజ జడ్జిగా వ్యవహరిస్తోంది.

ఈ కామెడీ షోలో ఎంతోమంది టీవీ ఆర్టిస్టులతో పాటు కమెడియన్లు కూడా పాటిస్పేట్ చేస్తున్నారు. ఇటీవల జరిగిన ఎపిసోడ్ లో ఇంద్రజ తన వ్యక్తిగత విషయాల గురించి చెబుతూ కన్నీటిపర్యంతమయ్యారు. తన జీవితంలో జరిగిన చేదు అనుభవాల గురించి మాట్లాడుతూ “1998వ సంవత్సరంలో చేతిలో ఉన్న డబ్బంతా ఖర్చు చేసి ఒక ఫ్లాట్ కొన్నామని అదే సమయంలో తన తల్లికి కార్డియాక్ అరెస్ట్ అవ్వడంతో డాక్టర్లు ఆపరేషన్ చేయాలని చెప్పారు. చేతిలో ఉన్న డబ్బంతా ఫ్లాట్ కొనుగోలు చేయటానికి ఖర్చు చేయడం తో డబ్బులు లేక నానా అవస్థలు పడ్డామని ఆవిడ చెప్పుకొచ్చారు. తను పనిచేసే రెండు కంపెనీలు ఇచ్చిన చెక్కులు కూడా బౌన్స్ అవటంతో అమ్మ కి ఆపరేషన్ చేయించడం కుదరదేమో అనుకున్నాం”అని చెప్పుకొచ్చారు.

ఆ సమయంలో ఎవరిని డబ్బు అడగాలో తెలియక ఇంట్లో ఉన్న బంగారు నగలు అన్నీ అమ్మి ఆపరేషన్ చేయించాల్సి వచ్చింది. ఆపరేషన్ జరిగిన 15 సంవత్సరాలకు అమ్మ మాకు దూరం అయ్యింది అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ సంఘటన జరిగినప్పటి నుండి ఎవరికైనా డబ్బు అవసరం అని తెలిస్తే వెంటనే సహాయం చేస్తానని ఆమె చెప్పుకొచ్చారు. నా జీవితంలో జరిగిన చేదు అనుభవాలను అది ఒకటి అంటూ ఇంద్రజ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆవిడ కన్నీటి గాధలు విన్న నెటిజన్లు ఆమె నవ్వు వెనక ఇంతటి బాధ ఉందా అంటూ ఆశ్చర్యపోతున్నారు.