గుడ్ బై చెప్పడం ఇష్టం లేదు.. ఆశక్తికరమైన పోస్ట్ చేసిన రష్మిక?

నేషనల్ క్రష్ రష్మిక ఎలాంటి అంచనాలు లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అతి తక్కువ సమయంలోనే దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్ర తారగా గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా పుష్ప సినిమాతో ఏకంగా పాన్ ఇండియా హీరోయిన్ గా పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇలా పలు భాషలలో వరుస సినిమా అవకాశాలను అందుకుని ప్రస్తుతం ఈమె వరుస సినిమా షూటింగులతో బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే తెలుగు సినిమాలతో పాటు బాలీవుడ్ సినిమాలకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది.

ఇకపోతే సిద్ధార్థ మల్హోత్రాతో కలిసి మిస్టర్ మజ్ను సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈమె ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం రష్మిక బాలీవుడ్ ఇండస్ట్రీలో గుడ్ బై అనే సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకోవడంతో చిత్రబృందం ఎంతో ఘనంగా సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నా బేబీ గుడ్ బై సినిమా కి గుడ్ బై చెప్పాలని అనిపించడంలేదు అంటూ రష్మిక సోషల్ మీడియా వేదికగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న విషయాన్ని తెలిపారు.

గత రెండు సంవత్సరాల నుంచి గుడ్ బై సినిమా షూటింగ్ ను కరోనాతో సహా ఏదీ అడ్డుకోలేదు. ఈ సినిమాతో అమితాబచ్చన్ సార్ తో కలిసి నటించే అవకాశం వచ్చింది. నిజంగా ఆయనతో కలిసి నటించే అవకాశం రావడం నా అదృష్టం ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని కల్పించినందుకు డైరెక్టర్ వికాస్ బహల్ కి కృతజ్ఞతలు అంటూ రష్మిక సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ఇకపోతే ప్రస్తుతం ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలో రణబీర్ కపూర్ సరసన యానిమల్ అనే చిత్రంలో నటిస్తున్నారు.