Geetha Madhuri: నేను రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తే తట్టుకోలేరు… షాకింగ్ కామెంట్స్ చేసిన గీతామాధురి!

Geetha Madhuri: ప్రస్తుతం ఎక్కడ చూసిన మనకు జై బాలయ్య అనే పాట పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతుంది. బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన అఖండ సినిమాలోని ఈ పాట ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఈ పాటను పాడటం ద్వారా మరోసారి సింగర్ గీత మాధురి వార్తల్లో నిలిచారు. చాలా రోజుల తర్వాత గీత మాధురి సూపర్ హిట్ సాంగ్ ద్వారా ఫేమస్ అయ్యారు.ఇక ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇదే పాట ఫేమస్ అవడంతో గీతామాధురి ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా గీత మాదిరి మాట్లాడుతూ తాను ప్రతి ఒక్క పాట కూడా ఇదే విధంగా పాడతానని అయితే కొన్ని హిట్ అవుతాయి కొన్ని హిట్ కావనే సమాధానం చెప్పారు. ఇకపోతే ఈ పాట కోసం ఈమె ఎంత రెమ్యునరేషన్ తీసుకుందనే విషయంపై కూడా పెద్దఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఇక ఈ పాటకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారనే విషయం గురించి గీత మాధురి చెప్పకనే చెప్పినట్టు సమాధానం చెప్పారు.

ఈ సందర్భంగా రెమ్యునరేషన్ గురించి గీత మాధురి మాట్లాడుతూ తాను ఎప్పుడూ కూడా ఎవరినీ అంత రెమ్యూనరేషన్ కావాలని డిమాండ్ చేయలేదని.. నేను డిమాండ్ చేస్తే తట్టుకోలేరని, అందరూ మీరు కూడా రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారా…అంటూ అందరూ ఆశ్చర్యపోతారని తెలిపారు. ఇక ఒక్కో పాటకు ఇంత రెమ్యూనరేషనే అని తమన్ ముందుగానే ఫిక్స్ చేసి ఉంటారని అందుకే తాను ఎప్పుడు రెమ్యూనరేషన్ గురించి డిమాండ్ చేయని గీత మాధురి ఈ సందర్భంగా తన రెమ్యునరేషన్ గురించి మాట్లాడారు.