సుధీర్, రష్మీ మధ్య జబర్దస్త్ లవ్ ట్రాక్ వల్లే ఫేమస్ అయ్యారు: హైపర్ ఆది

జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన కమెడియన్స్ లో కిరాక్ ఆర్పీ కూడా ఒకరు. ఇలా జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయిన ఆర్పీ తాజాగా జబర్దస్త్ గురించి,జబర్దస్త్ యాజమాన్యం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతము ఆర్పీ జబర్దస్త్ గురించి చెప్పిన మాటలు ఇండస్ట్రీలో కలకాలం రేపుతున్నాయి. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆర్పీ జబర్దస్త్ గురించి మాట్లాడుతూ..అక్కడ మనుషులని చాలా హీనంగా చూస్తారు. కనీసం మంచి భోజనం కూడా పెట్టరు అని మండిపడ్డాడు. అంతే కాకుండా సుధీర్, రష్మి కి పర్సనల్ లైఫ్ లెకుండా చేసి ఆ షో నుండి బయటికి రాకుండా చేశారు అంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా సుధీర్ జబర్దస్త్ వల్ల చాలా టార్చర్ అనుభవించాడు అని చెప్పుకొచ్చాడు.

అయితే ఇలా జబర్దస్త్ గురించి ఆర్పీ చేసిన వ్యాఖ్యల గురించి హైపర్ ఆది, రాంప్రసాద్ స్పందించారు. ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆది, రాంప్రసాద్ మాట్లాడుతు ఆర్పీ చెప్పేవి అన్ని అపద్దాలే. ఆర్పీ ఎందుకు ఇలా చెప్తున్నడో తెలియదు అంటూ చెప్పుకొచ్చారు. జబర్దస్త్ గురించి వస్తున్న తప్పుడు ప్రచారాలను ఖండించడానికి మేము ఈ ఇంటర్వ్యూ కి వచ్చాము ఉంటూ ఆది రాంప్రసాద్ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో సుధీర్ రష్మీ కి పర్సనల్ లైఫ్ లేకుండా చేశారు అని ఆర్పీ అన్న మాటలకి గురించి కూడా ఆది, రాంప్రసాద్ స్పందించారు.

ఈ క్రమంలో ఆది మాట్లాడుతు డైరెక్టర్లు నితిన్, భరత్ సుధీర్, రష్మి మధ్య ట్రాక్ క్రియేట్ చేసారు. దానివల్ల సుధీర్, రష్మిల వ్యక్తిగత జీవితాలకు ఏం కాలేదు. అలా చేయమని వాళ్ళని ఎవరూ బలవంతం చేయలేదు వాళ్లకు నచ్చే చేసారు. మరి వారికి లేని బాధ ఆర్పీకి ఎందుకు? ఇప్పుడు ఆర్పీ చేస్తున్న ఛానల్ లో కూడా అదే ట్రాక్ చూపించారు కదా మరి అదేంటి అంటూ ప్రశ్నించారు. సుధీర్, రష్మి మధ్య లవ్ ట్రాక్ పెట్టడం వల్లే వాళ్ళు ఇంత పాపులర్ అయ్యారు. ఈ పాపులారిటీతోనే వాళ్ళు ఇప్పుడు సినిమాలలో హీరో, హీరోయిన్లుగా చేస్తున్నారు. ఇలా చేయటం వల్ల వారికి మంచి జరిగిందే కానీ వారు ఏమి నష్టపోలేదు అంటూ చెప్పుకొచ్చారు.