ఉద్దేశపూర్వకంగానే సుదీర్ ను బయటకు పంపించారా.. ఆది మాటలకు అర్థం అదేనా?

తెలుగు బుల్లితెర స్టార్ నటుడిగా ఎంతో పేరు సంపాదించుకున్న సుడిగాలి సుదీర్ ప్రస్తుతం బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ వంటి కార్యక్రమాలకు పూర్తిగా దూరమయ్యారు.ఈ విధంగా ఈ టీవీకి దూరమైన సుడిగాలి సుదీర్ స్టార్ మాకు దగ్గరవుతూ స్టార్ మాలో ప్రసారమయ్యే పలు కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. సుడిగాలి సుదీర్ ఈ విధంగా ఈ టీవీలో ప్రసారం అవుతున్న కార్యక్రమాలకు ఎందుకు దూరమవుతున్నారనే విషయం గురించి క్లారిటీ లేక పోయినప్పటికీ ఈ విషయం గురించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఈ క్రమంలోనే కొందరు సుడిగాలి సుధీర్ మల్లెమాల వారి పంపించారు అంటూ వారి అభిప్రాయాలను కూడా వ్యక్తం చేస్తున్నారు.ఇకపోతే తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది.ఈ ప్రోమో లో భాగంగా హైపర్ ఆది చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే సుడిగాలి సుదీర్ ఉద్దేశపూర్వకంగానే పంపించినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆటో రామ్ ప్రసాద్ వచ్చి హైపర్ ఆదితో మాట్లాడుతూ తనకు సన్మానం చేయాలని భావిస్తున్నామని చెబుతాడు.ఈ మాటకు హైపర్ ఆది సమాధానం చెబుతూ అంటే నన్ను కూడా వాడిలా పంపించేయాలని భావిస్తున్నారా అంటూ పరోక్షంగా సుడిగాలి సుధీర్ గురించి తెలియజేస్తారు.

ఈ విధంగా హైపర్ ఆది మాటలు చూస్తుంటే సుడిగాలి సుదీర్ ఉద్దేశపూర్వకంగానే పంపించారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.ఇకపోతే హైపర్ ఆది రష్మీ తో మాట్లాడుతూ తాను గత వారం ఈ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించిన విషయం మనకు తెలిసిందే ఈ విషయం గురించి రష్మీతో మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి ఒక ఎపిసోడ్ చేసావ్ కదా బాబు ఏమన్నాడు అంటూ సుధీర్ ఉద్దేశిస్తూ మాట్లాడుతాడు. అప్పుడు రష్మీ మాట్లాడుతూ బాగా చేశావు కానీ రాంప్రసాద్ హైపర్ ఆదికి దూరంగా ఉంటే మంచిదని చెప్పాడని సమాధానం చెప్పింది. అందుకేగా పంపించాము అంటూ హైపర్ ఆది మరోసారి సుధీర్ గురించి పరోక్షంగా మాట్లాడటంతో ఉద్దేశపూర్వకంగానే ఈ కార్యక్రమం నుంచి తప్పినట్లు తెలుస్తోంది.