హైదరాబాద్‌లో ఐఏఎంసీ శాశ్వత భవనానికి శంకుస్థాపన!

అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ మీడియేషన్ సెంటర్ శాశ్వత భవన నిర్మాణానికి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రమణ శంకుస్థాపన చేశారు. సెంటర్లా సింగపూర్ హైదరాబాద్ కేంద్రం ప్రపంచ ఖ్యాతి సంపాదించాలని ఆకాంక్షించారు. హైటెక్స్‌లోని ఐకియా సమీపంలో ఈ భవానాన్ని నిర్మిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు జడ్జిలు జస్టిస్‌ ఎల్.నాగేశ్వర్‌రావు, జస్టిస్‌ హిమాకోహ్లీ, హైకోర్టు సీజే జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ, మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్‌రెడ్డి, మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్‌ గౌడ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ పాల్గొన్నారు