Crime News: బ్రతికున్న భార్యను పూడ్చిపెట్టిన భర్త.. వివాహేతర సంబందానికి అడ్డుగా ఉందని..!

Crime News: ప్రస్తుత కాలంలో యువతీ యువకులు ప్రేమ పేరుతో మోసపోతున్నారు. వారు పెళ్లిళ్లు చేసుకున్న తర్వాత కూడా సక్రమంగా కాపురం చేయకుండా వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో వివాహేతర సంబంధాల వల్ల చాలా మంది భార్యాభర్తలు విడిపోతే గా మరికొంతమంది మాత్రం వారిని హతమార్చడానికి కూడా వెనకాడటం లేదు. తమిళనాడులో ఇటీవల ఇటువంటి దారుణ ఘటన చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే… తమిళనాడులోని వేలూరు జిల్లా, కాట్పాడీలో నివాసం ఉంటున్న వినాయకం అనే వ్యక్తి సుప్రజ అనే యువతిని ప్రేమించి నాలుగేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వివాహం తర్వాత కొంతకాలం సాఫీగా సాగిపోయిన వీరి జీవితంలో భర్త పెట్టుకున్న అక్రమ సంబంధం కారణంగా తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి.

ఈ నేపథ్యంలో మరో అమ్మాయితో వివాహేతర సంబంధం పెట్టుకున్న వినాయకం ఎలాగైనా భార్యను వదిలించుకొని వేరే అమ్మాయితో హాయిగా జీవితం గడపాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో వినాయకం భార్య అడ్డు తొలగించుకోవడానికి ఆమెకు మాయమాటలు చెప్పి పథకం ప్రకారం అడవిలోకి తీసుకెళ్ళాడు. వినాయకం ముందే వేసుకున్న ప్లాన్ ప్రకారం అతని తమ్ముడు విజయ్ , స్నేహితుడు శివ సహాయంతో భార్య బతికి ఉండగానే గొయ్యి తీసి అందులో పూడ్చి పెట్టాడు

.. భార్యను వదలి మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగించాడు. విషయం తెలుసుకున్న భార్య సుప్రజ.. భర్తతో తరచుగా గొడవ పడేది. అయితే భార్య అడ్డు తొలగించుకోడానికి వినాయకం పథకం వేశాడు. భార్యను మాయమాటలతో నమ్మించి అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. తన తమ్ముడు విజయ్, స్నేహితుడు శివ సహాయంతో సమీపంలోని అటవీ ప్రాంతంలో బతికి ఉండగానే భార్యను పూడ్చి పెట్టాడు.అనంతరం ఏమీ తెలియనట్టు తానే తన భార్య కనిపించడం లేదని పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు.సుప్రజా తల్లిదండ్రులు తమ అల్లుడు మీదే అనుమానం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేసుకొని పోలీసులు విచారణ చేయగా అసలు నిజం బయటపడింది. వినాయకం తో పాటుఅతనికి సహాయం చేసిన మిగిలిన ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.