మైనర్లకు పబ్బులో అనుమతి ఎలా ఇచ్చారు అంటున్న బట్టి విక్రమార్క..

జూబ్లీహిల్స్ లో జరిగిన ఘటన గురించి స్పందించిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క.. అసలు మైనర్లకు పబ్బుల్లో అనుమతి ఎలా ఇచ్చారు అంటూ మండిపడ్డారు. ఈ ఘటన పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని అన్నారు. పోలీసులు అరెస్టు చేయకుండా ఏం చేస్తున్నారు అని మండిపడ్డారు. అధికార పార్టీ సొంత వాళ్ళకు పబ్బులో అనుమతి ఇవ్వడంతోనే ఇలాంటి సమస్యలు వచ్చాయని అన్నారు.

రాష్ట్రంలో పబ్బుల నియంత్రణ లేకుండా పోయిందని.. ఘటన జరిగి ఇన్ని రోజులైనా కూడా నిందితులను అరెస్టు చేయలేదని.. ప్రభుత్వానికి భయపడి పోలీసులు చర్యలు తీసుకోవడం లేదు అని అన్నారు. నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరు పర్చాలని.. హైదరాబాద్ డ్రగ్స్ అడ్డాగా మారింది అని అన్నారు.