Balakrishna: మా జోలికి వస్తే అస్సలు ఊరుకోను… వైసీపీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన బాలయ్య!

Balakrishna: నందమూరి నటసింహం బాలకృష్ణ కేవలం సినీ నటుడిగా మాత్రమే కాకుండా రాజకీయ నాయకుడిగా కూడా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఈయన ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత హిందూపురం నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఇలా బాలకృష్ణ మూడుసార్లు అద్భుతమైన మెజారిటీతో విజయం సాధించారు.

ఇక 2024 ఎన్నికలలో కూడా బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించారు అయితే తాజాగా బాలకృష్ణ తన సొంత నియోజకవర్గమైన హిందూపురంలో పర్యటన చేశారు. హిందూపురంలోని పేద ప్రజలకు ఇళ్లపట్టాలను పంపిణీ చేశారు. ఇలా ఇళ్ల పట్టాలా పంపిణీ కార్యక్రమానికి బాలకృష్ణ హాజరు కావడమే కాకుండా ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన మాట్లాడుతూ వైసిపి నేతలకు తనదైన శైలిలోనే వార్నింగ్ ఇచ్చారు.

మా జోలికి మా కార్యకర్తల జోలికి ఎవరైనా వస్తే చూస్తూ ఊరుకోము అంటూ బాలయ్య వార్నింగ్ ఇచ్చారు. రాయలసీమ తన అడ్డా అని, హిందూపురం అభివృద్ధికి ప్రతినిత్యం కృషి చేస్తానని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజినరీ ఉన్న ఒక గొప్ప నాయకుడు హిందూపురం అంటే ఎన్టీఆర్ గారికి రెండో పుట్టినిల్లుతో సమానమని బాలకృష్ణ ఈ సందర్భంగా తెలియజేశారు.

ఇలా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పది నెలల కాలంలోనే హిందూపురం నియోజకవర్గంలో సుమారు 50 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశామని తెలియజేశారు. హిందూపురం నియోజకవర్గంలో శాశ్వత మంచినీటి సమస్యకు పరిష్కారం తీసుకువస్తామని ఈ సమస్యను తరిమికొట్టడానికి మరో 130 కోట్ల రూపాయలు అదనంగా అవసరమవుతాయని అందుకు నివేదికను కూడా సిద్ధం చేసాము అంటూ ఈ సందర్భంగా బాలకృష్ణ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.