Tirupathi: పహల్గాం ఎఫెక్ట్ తిరుమలలో హై అలర్ట్…. ఆ వస్తువులు ఉన్నాయో జైలుకే?

Tirupathi: పహల్గాం ఉగ్రదాడి ఘటన తర్వాత కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. ఈ క్రమంలోనే అన్ని రాష్ట్రాలలోను కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి అంటూ ఆదేశాలను జారీ చేశారు అదేవిధంగా ఏ రాష్ట్రంలోనైనా పాకిస్తాని వాళ్ళు నివాసం ఉంటే వారిని వారి దేశాలకు పంపించేయాలి అంటూ ఆదేశాలను కూడా జారీ చేశారు. ఇలా ఈ ఉగ్ర దాడిలో భాగంగా 28 మంది మరణించడంతో కేంద్ర ప్రభుత్వం హై అలర్ట్ అయింది.

తాజాగా తిరుమలలో క్యాబ్‌లు నడుపుతున్న 400 మంది డ్రైవర్లు, 50 మంది ఓనర్లతో టీటీడీ దేవస్థానం చీఫ్ విజిలెన్స్‌ అండ్‌ సెక్యూరిటీ ఆఫీసర్ హర్షవర్ధన్‌ రాజు సమావేశం నిర్వహించారు. భక్తుల భద్రత కోసం ఎలా వ్యవహరించాలి అనే విషయంపై ఆయన దిశా నిర్దేశాలు చేశారు. అదేవిధంగా అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే వెంటనే సమాచారం అందజేయాలని కోరారు.

జేబుదొంగలు అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే వారిని అదుపులోకి తీసుకోవాలని సూచించారు. ఇక తిరుమలలో నిషేధం వస్తువులను కనుక వెంట తీసుకొని వెళ్తే వారికి జైలు శిక్ష తప్పదని అధికారులు తెలిపారు.ఇతర నేరస్థులు తమ వాహనాలను ఎక్కినట్లు క్యాబ్ డ్రైవర్లు గుర్తిస్తే వెంటనే దగ్గర్లోని పోలీసులు లేదా డయల్‌ 112కు సమాచారం ఇవ్వాలని హర్షవర్ధన్ రాజు సూచించారు.

తిరుపతిలోని అన్ని రోడ్లు, ముఖ్య జంక్షన్ లలో బాంబు, డాగ్‌ స్క్వాడ్లు తనిఖీలు చేస్తున్నాయి. బాంబు స్క్వాడ్‌లు రంగంలోకి దిగి లాడ్జీలు, కొన్ని భవనాల్లో తనిఖీ చేస్తున్నారు. ఆలయాల దగ్గర భద్రతనూ పెంచారు. అన్ని వాహనాల తనిఖీలు చేస్తున్నారు. శ్రీవారి ఆలయం పైభాగంలో, గొల్ల మండపం వద్ద సాయుధ సిబ్బందిని అప్రమత్తం చేశారు.