ఇండస్ట్రీలో మహిళల పట్ల వివక్షత ఏమాత్రం తగ్గలేదు.. తాప్సీ!

మంచు మనోజ్ హీరోగా నటించిన ఝుమ్మంది నాదం సినిమా ద్వారా హీరోయిన్ గా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన తాప్సి ఆ సినిమా ద్వారా హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ సినిమాలో తాప్సీ తన అందం, అభినయంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వత టాలివుడ్ లో తాప్సీకి వరుస అవకాశాలు వచ్చాయి. ఇలా స్టార్ హీరోల సరసన నటించిన తాప్సికి తెలుగులో సరైన హిట్స్ లేక బాలీవుడ్ వైపు తన దృష్టి మళ్లించింది. బాలీవుడ్ లో తాప్సి నటించిన సినిమాలు మంచి హిట్ అవ్వడంతో అక్కడ హీరోయిన్ గా సెటిలైపోయింది. బాలీవుడ్ లో హీరోయిన్ గా మంచి గుర్తింపు రావడంతో తాప్సి టాలీవుడ్ ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైంది.

తాజాగా తాప్సి ఇండస్ట్రీ కి వచ్చి 12 ఏళ్లు పూర్తి అయ్యాయి. ఈ సందర్భంగా తాప్సి ఇండస్ట్రీ గురించి సంచలన కామెంట్స్ చేసింది. ఫుల్ డేరింగ్ గా ఉండే తాప్సి ఇండస్ట్రీలో మహిళల పట్ల వివక్ష చూపుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేసింది. తాను ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో హీరోలకు, హీరోయిన్లకు ఇండస్ట్రీలో చాలా వ్యత్యాసం చూపేవారని అయితే ఇప్పటికి అది అలాగే కొనసాగుతోందని ఆమె వెల్లడించింది. అంతే కాకుండా రెమ్యూనరేషన్ విషయంలో కూడా హీరోలకు ఎక్కువ ఇచ్చి హీరోయిన్స్ కి తక్కువ రెమ్యూనరేషన్ ఇస్తున్నారని అంతే కాకుండా కనీస వసతులు విషయంలో కూడా హీరోలకే ప్రాముఖ్యత ఇస్తున్నారని వెల్లడించింది.

తాను ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్ళలో హీరోయిన్స్ కి అగ్గిపెట్టెల్ల ఉండే క్యారీవాన్ ఇచ్చి హీరోలకు మాత్రం డబుల్ డోర్ క్యారీవాన్ లు ఇచ్చేవారు. మేకప్‌, కాస్ట్యూమ్‌, హెయిర్‌ స్టైలిస్ట్‌ ఇలా హెల్పర్స్ విషయంలో కూడా హీరోయిన్స్ పట్ల అంతే చిన్న చూపు ఉండేది. ఈ 12 ఏళ్లుగా మహిళల పట్ట ఇండస్ట్రీలో పెద్దగా మార్పు ఏమీ లేదని తాప్సి వెల్లడించారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం తాప్సి నిర్మాతగా కూడా మారింది. ఇటీవల తాప్సి ఔట్‌సైడర్స్‌ ఫిలింస్‌ అనే సంస్థను స్థాపించి సినిమాలను నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ బ్యానర్ లో బ్లర్‌, ధక్‌ ధక్‌ అనే రెండు రూపొందుతున్నాయి. ఇక తాప్సి నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం తాప్సీ షారుక్ ఖాన్ తో కలిసి డంకి సినిమాలో నటిస్తోంది. అంతేకాకుండా ఏలియన్, వో లడ్కి హై కహాన్, దొబారా వంటి సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది.