తనపై అసత్య కామెంట్లు చేసినందుకు పోలీసులకు ఫిర్యాదు చేసిన హీరోయిన్ రమ్య..

భారతీయ సినీ నటి రమ్య తెలుగు ప్రేక్షకులకు అభిమన్యు సినిమాతో పరిచయమైంది. నటిగానే కాకుండా రాజకీయ పరంగా కూడా బాగా యాక్టివ్ గా ఉండేది. గతంలో ఈమె కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ ఎంపీ గా బాధ్యతలు చేపట్టింది. ఆ తర్వాత బీజేపీ అధికారంలోకి రావడంతో అక్కడ రాజీనామా చేసింది.

ఇక ఈమె సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ఫోటోలను, వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇక తాజాగా తన సోషల్ మీడియాలో ఒక వ్యక్తి తరచుగా ట్రోల్ చేస్తున్నాడు అని, అసభ్యకర కామెంట్ లతో ఇబ్బంది పెడుతున్నారు అని పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. దీంతో ఈ విషయం గురించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.